పుట:Kavikokila-Granthamala3-Khandakavya.pdf/306

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీకృష్ణుని రాయబారము

285

ఐన నజాతశత్రుఁడు నయంబుఁ దితీక్షయు ధర్మర క్తియుం
బూనిన సాత్వికుండగుట బుద్ధివిహీను లొనర్చుసేఁత యొం
డేనియుఁ దప్పుగాఁదలఁచి యేయపకారము సల్పనోపఁడెం
తే నియతాత్మతం బవర మెందు జనార్తికి మూలమౌటచే.

ధరణిన్ క్షత్రియఘస్మరుండయి భుజదర్పంబునం జాప వి
ద్య, రణావేశమునం బ్రతాపగరిమన్ ధైర్యంబునం దుద్ది యె
వ్వరు లేకుండెడు జమదగ్ని సమరవ్యాపార పారీణతం
బొరినొప్పించిన భీష్ముఁడాహవమునం బోరంగ మాఱుండునే?

చాపాచార్య శరప్రయోగ విలసన్యా . . . సుకీర్తనం
బేపారన్ రణమందునీల్గు పరభూమీ ' , వచింపంగ నా
రా! పాఱుండు దలాలి మాకనుచు స్వర్గ స్త్రీలు పానాత్తమం
దాపాంగంబులఁ గాంతులంగనఁగ నేనా తాదృశుం బల్కుటల్ !

గురుసుతుఁడైన నేమి, తనకున్ రణమబ్బినఁ బూర్వపుణ్యమం
చరుసముఁ బొందుశౌర్యనిధి; యాతఁడు చివ్వకు రేఁగియాశుగో
త్కరముల నుద్ధతిం బఱపఁ దచ్ఛర ఝంకృతి హెచ్చరించు ని
ర్భరకులిశాయుధాగ్రముల వాడిమి పోడిమిమాలు వైరికిన్ .

కర్ణుఁడు వైరివీరలయకాలుఁడు కార్ముకమంది శౌర్య సం
పూర్ణతఁ గ్రోధమూర్తియయి పోరఁగడంగి నిశాతబాణముల్
ఘార్ణిలు సేననేయ రిపుకోటి శివుండొ రమాధవుండొ యా
కర్ణుఁడొ యంచు నిర్ణయముగాక గణింతురు నాకమేగుచో.