పుట:Kavikokila-Granthamala3-Khandakavya.pdf/304

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీకృష్ణుని రాయబారము

283

ఎపుడైనన్ గద సోరుగల్గునెడ నెంతే మోదమేపార భూ
మి పతుల్ భీముగదావిహారచణతోన్మేషంబుఁ జింతుంతు రే?
కృపభీష్మాఖిల వీరయోధులు సభంగీర్తింతురే విద్విష
త్తపనాపాదకగాండివంపుఁ బస నుత్తాలత్వమున్ సంజయా.

అడుగోపాండవ కల్పశాఖ కరుణాస్వాంతుడు దైత్యాంతకుం,
డడుగో భీముఁడు, వాడెయర్జునుఁడు సల్లారే కవల్ వారి వెం
బడియున్నారదెచూడుబాంధవహి తామాత్యుల్మహారాజులున్ .
గడఁకంజెప్పుమ వార్తలున్ననిచటన్ గౌతూహలంబొత్తగన్.

వారువినంగరాని యెటువంటి రహస్యములేని మాకు బం
గారమువచ్చినన్ వినుటగాదు; సభాస్థలమందు నియ్యెడం
జేరినవారలెల్లరును శ్రేష్ఠులు శిష్టులు మిత్రబాంధవుల్
శూరులు పండితుల్ గురుయశోధరులౌట నెఱుంగుమీమదిన్.

కావున ధృతరాష్ట్రుడు ని
న్నేవిధి వచియింపఁబంపె నింపుదొలఁక నీ
వావార్త లుగ్గడింపుమ
మావారలు మేము ముద మమందతఁగాంచన్.

అనిపాండుక్షితిపాలకాగ్రతనయుండాడంగ సూతాత్మజుం
డును దద్గర్వవచో విధానమునకొండుం బల్క కేయోలగం
బునఁ గూర్చుండిన వారికందఱికి సమ్మోదంబుగన్ మ్రొక్కియి
ట్లనియెం దేనియసోనలం జిలుకురమ్యాలాపముల్ భక్తిమై.