పుట:Kavikokila-Granthamala3-Khandakavya.pdf/292

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీకృష్ణుని రాయబారము

271

అనవుడు ధృతరాష్ట్రునివంక మొగంబై ద్రోణసుతుం డిట్లనియె.

పాండునృపాలసూనులు స్వభావకృపామయులౌట నీర్ష్యమై
గండుతనమ్ముఁబూనకయ కానలకేఁగిరి; కాకయున్న, తా
ఖండలసూతిగాండివముఁ గైకొన నొక్కఁడు నిల్చువాఁడె త
ద్భండన కౌశలోద్ధతి విధానము గోగ్రహణానఁజూడమే.

పాఱులెవారు “దేహి" యని పాండుమహీశుని రాజ్యభాగముం
గోరుట, కెమ్మెయిన్ విమతకుంజర కేసరులై రణావనిం
బోరి సమస్తసంపదలు పొందకయుందురె? యీయమన్నవా
రూరకపోదురే భుజబలోగ్రులు సంగరమన్న భీతిచే.

    అనవిని యింతదనుక సభ్యుల యభిప్రాయంబు గనుంగొన నెట్టులో కోపము బిగఁబట్టి వేచియున్న దుర్యోధనుండు దండతాడిత భుజంగప్రాయుండై వీరావేశంబునఁ కనీనికలు రక్త

గోళంబులై చూపఱకు వెఱపుం గఱప నిట్లనియె:


వెలితి ప్రసంగముల్ సలిపె వృద్దమహీపతి; యంతఁబోక పెం
జలమున సంజయుండు తసచాతురిఁ జూపెను ధర్మవేత్త నా
వలఁతుల యట్లు ద్రోణకృపవక్తలు వాకొనిరేమొ పద్ధతుల్
పలికెను ద్రోణపుత్రుఁడును పాండుతనూజుల శౌర్యగాధలన్.