పుట:Kavikokila-Granthamala3-Khandakavya.pdf/274

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రసికజనానందము

251

సిబ్బిగుబ్బలు గఱుపాటు చెందివడఁక
జాఱుపయ్యెదను సవరించకయ మఱచి
కాఁపు బొజుగును గాంచుచుఁ గదలకుండె
నతను పడుకింట వ్రాసిన ప్రతిమవోలె.

దైవవశమ్మున నప్పుడు
పూవులు గోయంగనేఁగు పూఁబోఁడి ననిం
ద్రోవకు నడ్డంబల్లిన
తీవనుసరియొత్తి మరలఁ దిరిగెడునపుడున్.

కులుకు మిటారి గబ్బిచనుగుబ్బలఁ జేసి తదీయభారముం
దెలిసి, లతాంగికౌను గడతేరదటంచుఁబిఱుందు భాగమున్
బలితపుమూలబంధనము భాతినొనర్చియు నారుకమ్మినిన్
వళులనుత్రాటితోనడుముపైబిగియించెనొయేమొబ్రహ్మయున్.

ఎచ్చటనైనఁగాంచితినె యిట్టిమనోహరరూపు? కాంచినన్
మెచ్చుగడించు క్రొందళుకు మీలకనుంగవయున్నె; యుండినన్
బొచ్చెములేని చంద్రకళఁబోలెడి నెన్నుదురున్నె; యుండెఁబో
యచ్చపలాయతాక్షి దరహాసము చాలదె గెల్వనంతయున్.

ఎయ్యదియూరు, మీరిచటికేగుటకుం గత మెద్దియయ్య యిం
కియ్యెడనుందు రె సతము; నెవ్వరుబంధులు, సమ్మదప్రదం
బయ్యెనె వాడసొంపు; పనులన్ని యుఁ దీరెనె; యెప్పుడేగుటల్;