పుట:Kavikokila-Granthamala3-Khandakavya.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్యము]

పండితప్రతిజ్ఞ

169

అన విని, కాంత: 'నేఁ గవిత నయ్య, వనాంతరసీమలందు రే
యును బవలెప్పుడుం బ్రకృతియుత్సవముం దిలకించుచుం, బికాం
గనలు మయూరముల్ సఖులుగాఁ బరిచర్యలుసల్ప నొంటిగన్
దినములఁ బుత్తు జవ్వనముఁ దీరును దియ్యము శాశ్వతంబుగన్ .

'కలికీ, యెంతటివింత! నీవె కవితా కళ్యాణివా? బాపురే!
తెలియం జాలకయుంటి, నీకొఱకు నే దేశాలు పట్నాలు కో
టలు పేఁటల్ గిరు లేళ్ళుదాఁటుకొని మూటాముల్లెభారంబునన్
దల చెప్పట్టగ బట్టగట్టి విసుగెత్తన్ వచ్చితిం గానకున్.

'నిన్నుఁగూడి ధర్మనియతులఁ బాల్గొనఁ
దలఁచి వచ్చినాఁడ, వలచినాఁడ,
నన్నుఁ ద్రోసిపుచ్చ న్యాయంబె? వైదిక
విధిహితంబుగాఁగఁ బెండ్లియాడు.

'అన్న వేళకు నతిథు లభ్యాగతులును
నింటికరుదెంచి కూర్చుండ, వంట గింటఁ
జేయ నిల్లాలు లే దని చెప్పలేక
తెగఁబడితిఁ గాంత, యాకొఱ దీర్పు మింక.

'హేమంతమున నైన నేటినీట మునింగి,
           మడిదోవతులు పాఁతమైల లుదికి,
యిలు నూడ్చుటాదిగాఁ గల పాఁచిపనులెల్ల
          విసుఁగు వేసట లేక వెళ్ళఁబుచ్చి,