పుట:Kavijeevithamulu.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తిక్కనసోమయాజి.

87

గణపతిరాజు మనుమసిద్ధిని మరల సింహాసన మెక్కించుట.

ఇట్లు సోమయాజిం బనిచి గణపతిదేవరాజు తనమంత్రి యగు శివదేవయ్యయనుమతిం గొని ప్రయాణభేరి వేయించి చతురంగబలసమేతుం డై దండయాత్రకు బయలువెడలెను. ఇట్లు పోయి ముందుగ వెల్నాటిరాజుం గెల్చి యతనిం దనయాజ్ఞకుఁ లోనుజేసికొని యప్పనంబులు గొని నెల్లూరిపై విడిసెను. అక్కడ నపు డధికారము చేయుచున్న "అక్కన, బయ్యన," అనుమనుమసిద్ధిరాజుదాయాదు లగువారిని మనుమసిద్ధిరాజును సింహాసనవిహీనునిం జేసిననేరమునకుఁగాను దండించి, వారిబిరుదులు తనకు ధారణయోగ్యంబులు కా వని వానిని తేరాల రుద్రారెడ్డి యనునొకసామంతునకు ధరియింప నిచ్చెను. ఇట్లు చేసి మనుమసిద్ధిరాజును నెల్లూరునకుఁ బిలిపించి మరల నాతని నారాజ్యమునకుఁ బట్టంబుగట్టి అతనికి స్వాధీనము గానియిరువదినాల్గుదుర్గంబుల సాధించి యతనికి రెండువేలయేనూఱుగ్రామంబులఁ జెల్లంజేసి, ఒక్క తటాకంబును గట్టించె. ఇట్లుగాఁ జేసి గణపతి రాజు మనుమసిద్ధి రాజుచేఁ బూజితుం డయి తనదేశంబులోని దగుగంగాపురంబునకు వచ్చెను. ఈ కథవలన సోమయాజి కాలములోనిరాజుల కతనియెడ నెట్టిగౌరవము గలదో తెలిసికొనవచ్చును.

సోమయాజిసంతతి.

ఇంతవఱకును సోమయాజికి మతవిషయములోపలను, లౌకిక విషయములోపలను గలవిశేషములను వివరించినారము - ఇఁక సోమయాజిసంతతిం గూర్చి వివరింపవలసి యున్నది. అట్టిపనికి నిదర్శనములను విస్పష్టముగఁ జూపెడు గ్రంథదృష్టాంతము లెవ్వియుం గానరావు. కాని జ్ఞానవాసిష్ఠము నాంధ్రీకరించినకవి సోమయాజికిఁ దాను సంబంధుఁడ నని కొంత వ్రాసి యుంచెను. దాని నిచ్చో వివరించెదను. దాని నట్లు వివరించుటకుఁ బూర్వము "ఆంధ్రకవిచరిత్రము" అనుగ్రంథములో వివరింపఁబడినయొకగాథ తెలుపవలసి యున్నది. అందులో - తిక్కన