పుట:Kavijeevithamulu.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

70

కవి జీవితములు

క. వినియును గనియును నెఱుఁగని, ఘనఫక్కిం దెనుఁగు సేయఁగా నెట్లగు నా
   కన వలదు దానిలక్షణ, మును నీ కది గలుగుచందమును విను మింకన్.

గీ. ఆంధ్రశబ్దచింతామణివ్యాకరణము, ముందు రచియించి తత్సూత్రములఁ దెనుంగు
   బాసచేఁ జెప్పె నన్నయభట్టు తొల్లి, పర్వములు మూఁడు శ్రీ మహాభారతమున.

              వ. ఆసమయంబున.

గీ. భారతముఁ దెనిఁగించుచుఁ దా రచించి, నట్టి రాఘవపాండవీయము నడంచె
   ఛందము నడంచ నీఫక్కి సంగ్రహించె, ననుచు భీమన యెంతయు నడఁచె దాని.

               వ. తదనంతరంబ.

ఉ. అదిని శబ్దశాసనమహాకవి చెప్పినభారతంబులో
   నేది వచింపఁగాఁబడియె నెందును దానిన కాని సూత్రసం
   పాదన లేమిచేఁ దెనుఁగుపల్కు మఱొక్కటి చేర్చి చెప్పఁగా
   రాదని దక్షవాటికవిరాక్షసుఁ డీనియమంబుఁ జేసినన్.

క. ఆమూఁడుపర్వములలో, సామాన్యుఁడు నుడువు తెనుఁగు లరసికొని కృతుల్
   దాము రచించిరి తిక్క సు, ధీమణి మొద లైనతొంటితెలుఁగుకవీంద్రుల్.

గీ. రాజరాజనరేంద్రతనూఁజుఁ డార్య, సఖుఁడు సారంగధరుఁడు శైశవమునందు
   నన్నయ రచించునెడఁ బఠనం బొనర్చె, నన్యు లెవ్వ రెఱుంగ రీ యాంధ్రఫక్కి.

క. ఆలోకసుతుఁడు మొన్నటి, కీలక సమ నామతంగగిరికడ నొసఁగెన్
   బాలసరస్వతులకు నతఁ, డోలిఁ దెనుఁగుటీక దాని కొప్పుగఁ జేసెన్.

క. అదిని భీమకవీంద్రుఁడు, గోదావరిఁ గలిపె దానిఁ గుత్సితమున నా
   మీఁదను రాజనరేంద్ర, క్ష్మాదయితునిపట్టి దాని మహి వెలయించెన్.

క. ఇల నెనుబదిరెండార్యలు, గలిగి పరిచ్ఛేదపంచకంబునఁ దగునీ
   విలసితఫక్కి మతంగా, చలవిప్రునివలన నీదుసదనముఁ జేరున్.

క. మును నారాయణధీరుఁడు, తనకు సహాయముగ సంస్కృతము వాగనుశా
   సనుఁడు రచియించె దానిన్, దెనిఁగింపఁగ నీకుఁ దోడు నే నిపు డగుదున్.

క. తాతనయు నూత్న దండియు, నీ తెనుఁగులలక్షణం బొకించుక యైనన్.
   జేతఃప్రౌఢిమఁ జెప్పిరి, క్ష్మాతలమున దీని తెఱఁగు గా వవి యెల్లన్.

అని యిట్లు స్వామి అప్పకవిస్వప్నంబునఁ దెల్పి యంతర్హి తుండు గాఁగ నామఱుసటిదినంబున మతంగనగ నివాసియగు బ్రాహ్మణుండు పుస్తకముం దెచ్చి యిచ్చె నని యున్నది. ఇది కలలోనివార్త యగుట చే దీనిలో యథార్థ మెంతవఱకో యబద్ధ మెంతవఱకో దానిం దెలిసి