పుట:Kavijeevithamulu.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నన్నయభట్టు.

67

భారతములో నెన్నిక యగుపద్యము.

ఇది పూర్ణంబైనయనంతరము కొందఱు పండితు లాతనిం జూడ నేతెంచి ప్రసంగవశంబున నాతని నతనిభారతంబులోని మిగుల రమణీయం బగుపద్యంబు చదువుం డనిన సోమయాజి విరాటపర్వంబులోని దగు :-

శా. "సింగం బాఁకటితో గుహాంతరమునం జేట్పాటుమై నుండి మా
     తంగస్ఫూర్జితయూథదర్శనసముద్యత్క్రోధ మై వచ్చునో
     జం గాంతారనివాసఖిన్నమతి నస్మ త్సేనపై వీఁడ వ
     చ్చెం గుంతీసుతమధ్యముండు సమరస్థేమాభి రామాకృతిన్."

అనుపద్యంబుఁ జదివిన వారందఱును దానియందలియుపమాసాదృశ్యలక్ష్మికి నెంతయు సంతసించిరి.

నన్న యభట్టు కాలనిర్ణయము.

ఇంతవఱకును భారతగ్రంథనిర్మాణమునకుం గలకారణములును అది పూర్తియైనరీతియును వ్రాసియున్నారము. ఇఁకను భారతప్రారంభ మెప్పుడు? భారతశేషమును దిక్కనసోమయాజి పూర్తిచేయుకాలమునకును దానికిని వ్యవధి యెంత యున్న దనుసంగతి యోజింపవలసి యున్నది. అం దివు డీకథయందు భారతకాలముంగూర్చిమాత్రము చర్చింతము. రెండవశంకకు సమాధానము తిక్కన సోమయాజి చరిత్రములోఁ జేయుదము. అందు మొదటిశంకకు సమాధాన మెట్లంటేని. -

ఇది రాజనరేంద్రునకుఁ గృతి యియ్యఁబడిన దవుటచే నతనికాలములోనిదే కావచ్చును. అతఁడు శాలివాహనశకము 944 మొదలు శా. సం. 985 వఱకును వేఁగిదేశములో నధికారము చేసియున్నట్లు చాళుక్యవంశస్థులశాసనములఁబట్టి స్పష్ట మగుచున్నది. కాని రామానుజాచార్యులు దిగ్విజయమున కీయాంధ్రాదిదేశములకు వచ్చువఱకును అదేశము లన్నియును జైనమతా క్రాంతములై యుండెను. అటుపిమ్మట ననఁగా శా. సం. 1000 లకు మీఁదట మరల నీదేశములో బ్రాహ్మణమ