రామగిరి సింగనకవి.
701
పార రచించి యందఱఁ గృతర్థులఁ జేసినపుణ్యమూర్తులన్
సారమతిన్ భజింతు ననిశంబును నన్నయతిక్కనార్యులన్."
దీనింబట్టి భారతారణ్యపర్వశేషమును భారతశేషం బగుహరివంశమును బూర్తిచేసిన యెఱ్ఱప్రెగ్గడ యీ కవికాలమునకుఁ బై కార్యము చేసియుండునట్లే సూచించు. లేదా యితనికాలీనుఁ డైన గావచ్చును.
స్వగురువర్ణనము.
"క. ధర నిహపరములకును గురు, చరణంబులె యూఁత యగుటఁ జర్చించి మదిం
బరవాదిభద్రవారణ, హరిభక్తులఁ దిరుమలయ్యయార్యులఁ దలఁతున్."
దీనింబట్టి పరవాదిభద్రగజకేసరి బిరుదాంకితుఁ డగుతిరుమలాచార్యుఁ డితనిగురుం డని తేలినది. ఈ తిరుమలాచారి కాలముఁ దెలియు నాధారములు లేవు.
కృతిపతికిఁ బ్రభుఁ డగుముప్పభూపాలువంశావళి.
1. కూనయముప్పరాజు.
|
2. గురిజాల తెలుఁగు రాయఁడు
|
3. ముప్పదిరాజు ----------- ముత్తరాజు 4.
ఈ ముప్పదిభూపాలుని రాజ్యాదికము.
"వ. అని ప్రశంసింపఁదగిన విభవ విలాస విక్రమ విజయ విఖ్యాతులఁ బ్రసిద్ధుండైన ముత్తభూపాలుండు తనకు సహాయుఁడుగా గౌతమీ దక్షిణభాగంబునఁ బరమ పావనం బగుసబ్బినాటిరాష్ట్రంబున రామగిరిపట్టణంబు నిజరాజధానిగాఁ బురందర విభవుండై రాజ్యంబుసేయుచున్న ముప్పరాజు."
అని చెప్పి అతని బిరుదులం దెల్పె. అవి యెవ్వియన. -
"1. నీరునెత్తురుగండ. 2. గండరగండగోపాల. 3. కాంచీరక్షపాలక. 4. చోడరాజ్యస్థాపనాచార్య. 5. దొంతియమన్నెవిభాళ. 6. చలమర్తిగండ. 7. గజగండ వారణ. 8. రాయగజకేసరి. 9. మూరురాయజగకాళినానా బిరుదవిఖ్యాతుండు, అగు ముప్ప భూపాలచంద్రుఁడు."
కృతపతికందనవంశము.
పైముప్పరాజచంద్రునకు సకలసామ్రాజ్యభారధురంధరుండును, ధర్మచరిత్రుం