పుట:Kavijeevithamulu.pdf/708

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

700

కవి జీవితములు.

క. తన పేరిటివాఁ డనియును, దనదాసులదాసుఁ డనియుఁ దనకీకవితా
    వనితామణి నిచ్చినవాఁ, డనియును రక్షించు గాక హరి నన్ను దయన్."

అని యున్న పైవిజ్ఞాపనాంశముంబట్టియు గృతిపతి నిర్ణయాంశముంబట్టియు నీకవిమనోదార్ఢ్యాదులును, యుక్తిపరంపరయును, గవిత్వ ప్రజ్ఞయుఁ గోచరంబు కాకపోదు. ఇట్టిధైర్యస్థర్యములు గలకవియును భాగవతము నాంధ్రీకరింప వెఱచి దానిలోని దశమస్కంధముమాత్రము దెనిఁగించె. దానికిఁ గారణము తత్త్వరహస్యార్థము లున్న పరమార్థగ్రంథ మదిగావున దానిం దెనిగింపఁగూడ దనునాకాలములోని పండితాభిప్రాయ మై యుండవచ్చును. అట్లున్నను కవికిఁ గలవిష్ణుభ క్తియే అతనిచేత నాభాగవతములోని శ్రీ కృష్ణకథావిశేషంబులనైనఁ దెలిఁగించక తప్పనట్లుత్సహించెను. పద్మపురాణోత్తరఖండమును వైష్ణవమాహాత్మ్యప్రతి పాదకంబేగావున నతఁడు ప్రథమములోనే దానిం దెనిగించె. ఇఁక నీవాసిష్ఠ రామాయణము భాగవతమువంటి మహత్తరగ్రంథమే అయినను, అందలి యంశములు పాఠకులకు సుబోధంబులు కావు. గావున దానింగూడఁ దెనిఁగించె. ఇది మిక్కిలి సంగ్రహఫక్కికగా నీతనివలనఁ దెనిఁగింపఁబడియె. అట్టిదానికి సమ్మతింపని నవీనకవులలో నొక్కండును, నైజాముదేశములోని ధర్మపురినివాసియు నగుకృష్ణగిరి వేంకటరమణకవివలన నీ వాసిష్ఠరామాయణము సంస్కృతమునకు సమముగా విపులముగా నుండునట్లుగా నాంధ్రీకరింపఁబడియె. ఈరెండుగ్రంథములకును గలభేదం బీ గ్రంథాంతమునఁ గొంత సూచించెదను. ప్రస్తుతములోఁ బద్మపురాణోత్తరఖండమున నీకవి వివరించిన కృతిపతివంశమును, అతనికినిఁ దనకును ప్రభుం డగుకుమారముప్పభూపాలునిచారిత్రమును వ్రాయవలసియున్నది. దానికి ముందుగా నీగ్రంథములో సింగనకవి పూర్వకవుల నెవ్వరిఁ బేర్కొనెనో ఆవృత్తాంతంబు గొంత పరిశీలించెదము -

ఆంధ్రపూర్వకవిస్తుతి.

"ఉ. భారతవేదవాక్యరసభావము లజ్ఞు లెఱుంగలేక ని
      స్సారమనస్కు లై తిరుగుచందముఁ జూచి తెలుంగుబాస బెం