పుట:Kavijeevithamulu.pdf/697

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వెన్నెలకంటి వేంకటాచలము.

691

ఈరంగప్పకు రెండవయన్నయగు (8. గుర్తుగల) రామన్న వర్ణన మీక్రిందివిధంబున నున్నది. ఎట్లన :_

"సీ. రామన్న మర్యాదరామన్న వేఁజెళ్ళ, నారాయణేంద్రుఁడు గారవమునఁ
      జనువీయ నాయనసంస్థానకర్తయై, పాలించుఁ బ్రజల సంపదలఁ బొదల
      గోలకొండవజీర్ణఁ గూడి దుర్గాలపై, ముత్తికహత్తించి మొత్తి మొత్తి
      కడుమన్నె సరదార్ల వడిచెడఁగాఁ గొట్టి, రాజుచే మెచ్చులు రమణ నందె.

తే. పొదిలె లింగప్పతోఁ గూడి భూము లెల్లఁ, గొట్టి విప్రుల కన్నంబు బెట్టి మించెఁ
    గలియుగంబున వెన్నెలకంటిరామ, మంత్రికిని నీడు లే రని మహికి నెక్కె."

దీనిలో నీరామనమంత్రి విశేషము యుద్ధములు చేసినట్లుగా నున్నది. అట్టి యవసర మతనిప్రభుం డగునారాయణరాజు చారిత్రములో వచ్చియున్నదేమో దానిం జూచుటయేకాక యీనారాయణరాజు వ్యవహార మెన్ని వత్సరములో యెప్పటినుండి యెప్పటివఱకో దానింగూడఁ జూడవలసియున్నది. ఆవివర మెట్లున్నదనఁగా :_

"కృష్ణమరాజుకుమారుఁడు పెదనారాయణరాజు. ఇతఁడును దండ్రివిధముగనే గుడ్లూరుపరగణా ననుభవించుచుండె. ఇట్లుండఁగా నితనికి భువనగిరిపైకి మోహి తర్లి పోవుటకు హుకుమైనది. ఆప్రకార మతఁడు పోయి లడాయి చేయఁగా దేహమంతయు గాయములుపడెను. ఇట్లుగా నున్నను గార్యము పూర్తిచేసుకొని వచ్చుటచేత నతనికిఁ దెల్లజెండా మొదలగు బిరుదు లనేకము లీయంబడినవి. వానిం దీసుకొని తిరుగ గుడ్లూరు చేరి ఆ గాయములవలననే పెదనారాయణరాజు మృతుఁ డాయెను. ఇతనివ్యవహారకాలము శా. స. 1522 ప్లవసం. మొదలు శా. స. 1558 ధాత సం. వఱకును ముప్పదియాఱుసంవత్సరము లై యున్నది."

అనియున్నది. కావున నీనారాయణరాజు మంత్రియు సేనానియు నైనవెన్నెలకంటి రామమంత్రికి యుద్ధము చేయవలసినయవసరము విస్తరించియే యున్నట్లు కానుపించును. ఈ యిర్వురికాలము నొక్కటియే అయియుండును గావున దానింగూర్చి వివరింపను.

(9) వేంకటాచలకవి.

పై రామన్నకు నన్న యగుసూరనకు నీగ్రంథకర్త కుమారుని కుమారుఁడు. ఆసూరనపుత్త్రులలోఁ బెద్దవాఁ డగుతిప్పన్న పై వేజెళ్లపె