పుట:Kavijeevithamulu.pdf/682

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

676

కవి జీవితములు.

"సీ. విమలవర్తనమున వేదశాస్త్రపురాణ, వాక్యార్థసరణికి వన్నె వెట్టె
      బరమహృద్యం బైనపద్యశతంబున, దేవకీతనయు విధేయుఁ జేసె
      రసికత్వమున దేవరాయమహారాయ, కరుణాకటాక్షవీక్షణముఁ గాంచె
      కర్ణాటకటకముల్ గలయంతయును మెచ్చ, గణకవిద్యాప్రౌఢి ఘనతకెక్కె
      గురులఁ బోషించె సత్కవివరుల మనిచెఁ,బ్రజల బాలించె భాగ్యసంపద వహించె
      హరితమునిముఖ్యవంశరత్నాకరేంద్ర, చంద్రుఁడైయొప్పుసిద్ధయజన్న మంత్రి."

ఇందులో వివరింపఁబడినదేవరాయ లెవ్వ రనుశం యున్నది. కర్ణాటరాజచారిత్ర మింకను సంపూర్తిగా దొరికియుండకుండు టంబట్టి యీ దేవరాయని పోల్చుటకు వీలులే కున్నది. పైఁ జెప్పిన సిద్ధయమంత్రి శా. స. 1180 గల కాలమువాఁడుగాఁ గాన్పించు. అతనికుమారులలో రెండవయతఁడీ జన్నయమంత్రి. కావున నితనికాలము శా. స. 1230 సమీపకాలము కావలసియున్నది. అప్పటికి కన్నడవిజయనగరపురనిర్మాణమే లేదు. బుక్కరాజు మొదలగు వారివ్యవహారమే ఆరంభము కాలేదు. ఆకారణమున బుక్క రాజునకుఁ గొందఱు పురుషు లైనపిమ్మట. 1406 లో ననఁగా శా. స. 1328 లోఁ గాన్పించు దేవరా జితని కాలీనుఁడు కాఁడని స్పష్టమే. ఈజన్న మంత్రియన్న యగు భాస్కరుఁడు లేక సూర్యుఁ డనునతఁడు రెడ్డివేమనృపునివలన నగ్రహారాదిక మందినవాఁ డగుటంజేసి అతనికాలము నొక్కటియే యగును. ఆవేమనృపాలునిపేరే అన్న వేమనృపాలుఁ డని చెప్పెదరు. అతఁడే యెఱ్ఱాప్రెగడవలన హరివంశమును గృతినందినవాఁడు. అతని శాసనము శా. స. 1268 మొదలు కాన్పించుచున్నది. ఆవఱకే అతఁడు బహుసంవత్సరములు రాజ్యముచేసె. అన్నదమ్ములగు సూరనకవి, జన్నయమంత్రియు నంతకుఁ బూర్వకాలములోని వారుగానే కాన్పించెదరు. అది శా. స. 1230 మొదలు 1268 వఱకు నగును.

(4) సిద్ధయమంత్రి (కృతిపతి.)

ఈ సిద్ధయమంత్రి యనేకప్రజ్ఞలు గలవాఁడుగా ననేక దేశభాషల నభ్యసించినవాఁడుగాఁ గాన్పించును. ఎట్లన్నను :_