పుట:Kavijeevithamulu.pdf/637

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బమ్మెర పోతరాజు.

631

ఉ. అద్దిర! శంకరుండు వినయంబున నా కెదు రేఁగుదెంచి నా
    పెద్దతనం బెఱింగి తనపెద్దఱికం బొకయించుకైన దా
    గ్రద్దనఁ జేయఁడయ్యె నట గౌరియు మన్ననసేయదయ్యె నీ
    పెద్దలు నవ్వ లాతిమునిబృందముచాట్పునఁ జేసి రిమ్మెయిన్.

క. అని తనపాలిటికర్మము పెనగొని తనచుట్టుముట్టి ప్రేరేపంగాఁ
    జెనటి యగుదక్షుఁ డప్పుడు మనమునఁ గోపంబునందమలహరు నిలిచెన్.

వ. ఇట్లు దేవదేవునిమహాత్మ్యంబు దెలియక వృథావైరంబున దక్షుం డటు వాసి చనియె నంత నమ్మహేశ్వరుఁ గొల్వవచ్చిన దేవేంద్రాది బృందారక సంఘంబులు పునః పునః ప్రణామంబు లాచరించి చనిరి తదనంతరంబ."

వెనుకటి భాగవతవృత్తాంత మంతయుఁ జదివినవారు దీని నేమని యూహించెదరో మన మాలోచింపవలసియున్నది. పోతనామాత్యుఁ డొక్కొకయంశంబుననే యేపురాణములో నేయేవిషయము లున్నవో అవియన్నియు నేకముఖము చేసి యథాస్థితి బయటఁబెట్టుటయందు కోర్కెగలవాఁ డని తోఁచక మానదు. ఇఁక వీరభద్రవిజయగ్రంథకర్త అట్టి సందియము లేకయే తన కిష్టమైన కథ లుంచి తక్కినవానిని వదలివేసినాఁ డని చెప్పక తప్పదు.

4. పైగ్రంథకర్త లిర్వురు నొక్కరు కా రని సూచించు నట్టి కొన్నిపద్యములు పార్వతీప్రయాణసమయములోనివానిం దెల్పెదను. అది చూచినవెంటనే పయికవు లిర్వురిలో సమయోచితవాక్కు లెట్లుగా నుండునో అదియును దెలియును. అపుడు కవుల భేదమును, కవిత్వభేదముం దెలియకపోదు. వీరభద్రవిజయమున దాక్షాయణి శివుని యనుజ్ఞ గోరఁగా నాయన యనుజ్ఞ యిచ్చినయనంతరవృత్తాంతము.

"గీ. అనుచుఁ జంద్రచూడుఁ డానతియిచ్చిన, శివుఁడు తన్ను వేఱుచేసె ననుచు
     ఫాలమందు పాణిపద్మముల్ ధరియించి, వెలఁది మ్రొక్కి నిలిచె వెఱపుతోడ.

మత్తకోకిల. తల్లి యాదిగఁ దండ్రి యాదిగఁ దాత యాదిగఁ గల్గువా
              రెల్లభంగుల నీవె కాని మహేశ యన్య మెఱుంగ నే
              నుల్లమందుల జిత్తగించితి నొప్పముల్ దగునయ్య యా
              ప్రల్లదుం డగు నాకుఁ దండ్రి భరంబు పల్కితి శంకరా.