పుట:Kavijeevithamulu.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నన్నయభట్టు.

51



జును, తద్రాజకీయోద్యోగులును, కొన్నిదినము లైనపిమ్మట దేశభాషయే రాజకీయభాషగాఁ గావలసినయగత్యము తటస్థించినప్పుడు ఆంధ్రదేశభాషనుగూడ విశేషముగ వృద్ధి నందించినట్లు కాన్పించును. కావుననే మన కిపుడు తెనుఁగుభాషలోని ప్రాచీనగ్రంథము లని చెప్పఁబడునవి యన్నియు నించుమించుగా నీ చాళుక్యరాజులకాలములోనివే యయి యున్నవి. అంతకును బ్రాచీనము లగుగ్రంథములు దొరకుటయే లేదు. పైగ్రంథములను రచియించినవా రందఱును లౌకికవ్యాపారములలోఁ బ్రవర్తించువారును వారిసంతతివారునునై యున్నారు. నేఁటివఱకును నదేసంప్రదాయము ననుసరించి యాంధ్రకవిత్వముఁ జెప్పువారు తఱుచుగా లౌకికవిద్యాభ్యాసకులే అయి యున్నారు.

పూర్వకాలములో నిట్టి లౌకికు లీ దేశమున కొక్కమాఱుగ వచ్చి యుండిరి. అప్పటిలో నీదేశ మంతయు జైనాక్రాంతమై యుండెను. కావున నప్పటిలో నీదేశమునకు వచ్చినయీలౌకిక బ్రాహ్మణులకు జైనులచే వృత్తిస్వాస్థ్యము లీయఁబడినవి. కావున వీరు వైదికవృత్తిలోఁ జేరిన వ్యాపారములుగూడఁ దామే నడుపుచు వచ్చినవా రైరి. అనంతరకాలములో వైదికు లీ దేశమునకు వచ్చినతరువాత పైలౌకికులు వైదికవృత్తితోఁ జేరినజీవనము వదలుకొని కేవలలౌకికజీవనమే ప్రధానముగాఁ గల వారైరి. అప్పటినుండియు నీవైదికలౌకికశాఖాభేద మేర్పడినది. ఇట్టిశాఖాభేదము లేర్పడినవిధ మంతయు నాదేశచారిత్రములో వివరింపఁబడి యున్నది కావున దాని నిట వ్రాయ నవసరములేదు.

ప్రస్తుతము మనము వ్రాయుచున్న నన్నయభట్టును పైవిధమున లౌకికవైదికములను నడుపుట కేర్పడినశాఖలోనివాఁ డని తెల్పి యనంతర మతనివృత్తాంతము మఱికొంత వివరించెదము. దీనిసంప్రదాయము గ్రంథాంతరములోఁ జూడఁదగు నని చెప్పెదము.

పూర్వులలో లౌకికశబ్దవాచ్యు లగునియోగులుగూడ భట్టుశబ్ద ముంచి వ్యవహరించినందులకుఁ బ్రయోగము గలదు. అది యెట్లనగా -