పుట:Kavijeevithamulu.pdf/621

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బమ్మెర పోతరాజు.

615

"క. తెంపును బెంపును గదుర ని, లింపులు వెరఁగంది చూడ రిపుసైన్యములుం
     గంపింపఁ దమబలంబులు, ఱంపిలి బిట్టార్వ సింధురాజుం దాఁకెన్."

ఈపద్యములోని ఱంపిలిశబ్దము సర్వత్ర గురు రేఫముగాన లఘువు గాదు. దీనికిని లఘు రేఫమునకును మైత్త్రి సోమయాజిచేఁ జెప్పఁబడియె. ఇచట మైత్త్రిగలలఘు రేఫము తత్సమంబుగావున ద్వైరూప్యము చెప్ప వీలులేదు. కావున నిచ్చో లఘ్వలఘు రేఫములమైత్త్రికి నొప్పికొనక తప్పదు. అని యిట్లు సులక్షణసారవ్యాఖ్యాత వ్రాసె.

ఈ పై నుదాహరించినపద్యంబున నింకొకవివాదాంశంబు గూడకాన్పించుచున్నది. అదియు నప్పకవికి సమ్మతము గానిదే. దానిం గూర్చి వాదించునవసరము మన కీవఱకు లేకున్నను గొన్ని స్థలంబుల నప్పకవి భారతముం జూడకయే స్వాభిప్రాయమును వ్రాసె ననుమాట యథార్థపఱుచుటకునై దాని నిట వివరింతము.

"తే. భరితభువనార్ణవంబుతో వంత సరియె, రమ్యమణిరాజరాజితో లక్క సరియె
      లలితవీణారవంబుతో ఢక్క సరియె,ననగఁ, జెల్లు నభేదాఖ్య నమరువళ్లు. అ. ఆ. 3.

వ. ఈ మూఁటిలోపలను భకారంబునకు వకారంబునకు నభేదవర్గయతులు గావునఁ బ్రయోగింపవచ్చు. లవర్ణమునకు డవర్ణమునకు నభేదవర్గయతులు గావు గావునఁ బ్రయోగింపరాదు. రవర్ణనమునకు లకారమునకు గ్రాహ్యంబు గాదు. వానికి లక్షణవిలాసమువారు తెలియక కొన్ని యుదాహరణంబులు వ్రాసినారు. అవియు నిట వివరించెద. నైషధములో 'లీలామకరాంకచంద్రరేఖాంకుర' అనియు రామాయణములో 'శారదాభ్రవిలీనత నేపారు చంద్రలేఖయపోలెన్‌' అనునదియుం గలవు. సంస్కృతమునందు రేఖాలేఖాశబ్దములు రెండునుం గలవు. కావున నీరెండుపద్యములయందుఁ జెప్పిన లేఖాశబ్దము మొదలిది ద్వితీయాంతస్థమని యెఱుంగునది.

అని వ్రాసియనంతరము వసుచరిత్రలో

"రోలంబాలక యోర్తు గ్రుంకి బిసవల్లుల్ దున్మి తూటడి" అనునీచరణంబులో 'లోలంబాలక' అని కవిహృదయము. దీనిం గానక కొందఱు 'ఇందిందిరశ్చంచరీ కోరోలంబో భంభరో ౽పిచ' అని యున్నది గావున రోలంబాలక యని చదువుదురు. ఇట్లని రామరాజభూషణకవి తలంపుగాదు."

అనియు వ్రాసి,