పుట:Kavijeevithamulu.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

50

కవి జీవితములు



గాన్పించును. (కొంగదేశపురాజకాల్ అనుచారిత్రము చూడవలెను.) అందుచేతఁ బై రాజనరేంద్రుఁడు తఱుచు పశ్చిమదేశమందే నివసించియుండె ననియును, అతని కాదేశస్థులే మంత్రులుగాను పురోహితులుగాను నుండి రనియును నూహించుట న్యాయమైనట్లు కాన్పించెడిని. కావున నన్నయభట్టారకుఁడు నక్కడివాఁడుగానే కాన్పించును. అతనికి నాదేశస్థులలోవలె లౌకికవైదికములు రెంటియందును బరిశ్రమ యుండ నోవును. అంతమాత్రమున నతనిని కేవలము వైదికశాఖలోని వాఁ డని చెప్పంజాలము. భట్టనుశబ్దము మహారాష్ట్రదేశములోనివిద్యావంతు లగుబ్రాహ్మణులకుఁ గల్గెడునొకబిరుదు. ఇట్టిబిరు దున్నంతమాత్రముచేత నీపైబిరుదుగలవారందఱును వైదికశాఖలోనివారే అని చెప్పనొప్పియుండదు గదా !

ఇపుడు మనము మాటలాడుచున్న కాలములోఁ గేవలవైదిక వృత్తిలో నుండువారు సంస్కృతభాష నొక్కదానినే నేర్చికొనునట్లును, లౌకికవృత్తిలో నుండువారుమట్టుకుఁ దప్పక రాజకీయభాషయు దేశభాషయు నగుటచేత నాంధ్రభాష నభ్యసించి యందు విశేషముగఁ భాండిత్యము కుదిరినచో దానిలోఁ గొన్నిగ్రంథములు రచియించి యాభాష యెడల మిక్కిలి యభిమానము గలవారలై యున్నట్లు కనుపించును. నేఁటికిని లౌకికములోఁబ్రవేశింపఁదలఁచుకొనువారలే రాజకీయభాషలోఁ గృషి చేయుదురు గాని కేవలవైదికవృత్తి నుండఁగోరువారు కారు. అట్టిస్థితిలో లౌకిక మనుమాటయే చెవులఁబెట్టని పూర్వకాలములో ననగాఁ బదివందలసంవత్సరములక్రిందట లౌకికులు గాఁ గోరనివారలు రాజకీయభాషలో గ్రంథము రచియించువఱకును గృషి చేసియుందు రనుట యుక్తిసహమై యుండదు. మఱియును వేఁగిదేశములోని కిట్టిరాజకీయ భాషాపండితులు మొదట వచ్చుకాలమునకు నీయాంధ్రభాష సామాన్యస్థితిలో నున్నట్లు కాన్పించును. అప్పటికిఁ బ్రసిద్ధము లైనగ్రంథములు లేవు. ఉన్న వైనను పదియిరువదిపుటల గ్రంథములుగాని అధికములు గావు. భాషయు నంతగా శిక్షితమై యుండకపోవచ్చును. ఇట్లుండఁగా రా