పుట:Kavijeevithamulu.pdf/617

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బమ్మెర పోతరాజు.

611

ఇంకను భేదంబుచే నొప్పుతావు లనేకము లున్నవి. ఆయాస్థలంబులలోఁ, గొన్ని క్త్వార్ధకసంధులును గొన్ని వ్యాకరణస్ఖాలిత్యంబులు దృష్టిగోచరం బయ్యెడి. ఇట్టిపొరబా ట్లుండుటచే నీ గ్రంథంబు ప్రామాణికగ్రంథంబు కాదయ్యె. ఇందులతప్పులన్నియుఁ బోతనామాత్యుని వని కొంద ఱూహింతురు. మఱికొందఱు మహాకవి యిట్టితప్పులు వ్రాయునా యనేకు లందు వ్రాసియుంటచే నవి కల్గెఁగాని వేఱొకటి కా దందురు. పోతనవిరచితంబును దచ్ఛిష్యవిరచితంబును మొత్తంబున మనకుఁ దెలిసియున్నను, దీని వివరింపఁజాలను. మూలముట్టుగఁ గొంత గ్రంథము చెడుట యే నిజమయ్యెనేని ఆచెడినగ్రంథంబులోని స్కంధంబులును దశమోత్తర భాగంబున నున్న "కాటుకనెఱయంగ" అను పద్యోపరిభాగంబును పోతనకృతంబులు గా వనుట స్పష్టమే. తాళపత్త్ర గ్రంథంబుఁ జెదులుదిన్నపుడు కొన్ని ఘట్టంబులును మఱికొన్ని పద్యంబులు నష్టంబు లై యుండనోవు. అట్టిపట్లును వీరిచేతనే వ్రాయఁబడియుండునుగదా వీనికినిఁ బోతనకుం గలతారతమ్యంబు వీరిచే వ్రాయఁబడినగ్రంథముచేతనే మనకు గోచరం బగు. అచ్చటచ్చట మనకుం గానఁబడునెఱసులు పోతనచే వ్రాయంబడినవో లేక వీరు వ్రాసియుండు తఱి నుత్పన్నంబు లాయెనో తెలిసికొనుట దుర్లభంబు. గ్రంథంబునఁ గాన్పించుతప్పులు పోతనశిష్యులవిగాని పోతనవి గావని తలఁచదగియున్నది. దీని కనుగుణంబుగ నప్పకవియు నొకపద్యంబు పూర్వలాక్షణికులది యుదాహరించె అదెట్లనిన :-

"ఉ. బమ్మెరపోతరాజకృత భాగవతంబు సలక్షణంబు గా
      కిమ్మహి నేమిటం గొదువ యెంతయు నారసి చూడఁ గాను రే
      ఫమ్ములు ఱాలునుం గలసి ప్రాసము లైనకతంబునం గదా
      యిమ్ముగ నాదిలాక్షణికు లెల్లను మాని రుదాహరింపఁగన్."

దీనిచేఁ బోతనకృత గ్రంథంబున నీ రేఫయుగమైత్త్రి దోషంబు తప్ప కడమ దోషంబులు లే వని యప్పకవియు సమ్మతించె. ఈ రేఫయుగ