పుట:Kavijeevithamulu.pdf/599

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బమ్మెర పోతరాజు.

593

"మ. ఒనరన్ నన్నయ తిక్కనాదికవు లీయుర్విం బురాణావళుల్
       దెనుఁగుల్ సేయుచు మత్పురాకృత శుభాధిక్యంబు దా నెట్టిదో
       తెనుఁగుం జేయరు మున్ను భాగవతమున్ దీనిం దెనింగించి నా
       జననంబున్ సఫలంబు సేసెదఁ బునర్జన్మంబు లేకుండగఁన్."

పోతన భాగవతమును దాను గంగాతీరమం దున్న సమయమందుననే చేయక తిరిగి యేకశిలానగరమునకు వచ్చినపిమ్మట దానింజేయ నారంభించె నని యీక్రిందివచనసందర్భంబువలన స్పష్టంబగు.

ఎట్లనిన :-

"వ. ఇట్లు భాసిల్లెడు శ్రీమహాభాగవత పురాణ పారిజాతపాదప సమాశ్రయంబున హరికరుణావిశేషంబున కృతార్థత్వంబు సిద్ధించె నని బుద్ధి నెఱింగి లేచి మఱికొన్ని దినంబులకు నేకశిలానగరంబునకుం జనుదెంచి యందు గురువృద్ధబుధబంధుజవానుజ్ఞా తుండ నై నాచిత్తంబునఁ బెన్నిధానంబుం బోనిశ్రీరామచంద్రునిసన్నిధానంబుఁ గల్పించుకొని శేషశాయికి సమర్పణంబుగా నే నాంధ్రంబున నొనర్పం బూనిన శ్రీమహాభాగవత పురాణంబునకుఁ గథాప్రారంభం బెట్టిదనిన?

అని వ్రాసె. దీనింబట్టి చూడ నీతండు గంగాతీరంబు వదలి స్వగ్రామం బగునేకశిలానగరంబునకు వచ్చి యనంతరము భాగవత మాంధ్రీకరింప నారంభించినట్లు స్పష్ట మగును. ఇం దుదాహరింపంబడిన యేకశిలానగర మెక్కడిదై యుండు నని యొక శంక వొడముచున్నది. కడపజిల్లాలోని యొంటి మిట్టకే యీనామ మున్నట్లు కొందఱమతము. ప్రతాపరుద్రునిరాజధాని యగునోరుగల్లునకే యీనామ మున్నదని మఱి కొందఱ యభిప్రాయము. గ్రంథాదులలో సర్వత్ర రెండవదే ప్రసిద్ధనామ మై కాన్పించును. దీనికి వ్యతిరేక మగుగ్రంథదృష్టాంత మగపడువఱకు నీరెండవస్థలమే యితనినివాసస్థలముగా నిర్ణయింతము.

నరకృతి నిషేధించుట.

ఈ బమ్మెరపోతరాజు భాగవతమున నరకృతి చేయఁగూడనట్లుగాఁ జెప్పికొనియె. అదెట్లంటేని :-

"ఉ. ఇమ్మనుజేశ్వరాధముల కిచ్చి పురంబులు వాహనంబులున్
      సొమ్ములుఁ గొన్ని పుచ్చికొని సొక్కి శరీరము వాసి కాలుచే