పుట:Kavijeevithamulu.pdf/572

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

566

కవి జీవితములు.

ఇంతియకాక యీ యాముక్తమాల్యద పుట్టుటకకుఁ గవికర్ణ రసాయనము కారణ మని యిదివఱకే వ్రాసియున్నాము దానినే మఱి యొకపరి చూడఁదగును.

కవికర్ణరసాయనముతో సరిగా నుండుటకు నుద్దేశించి రచియింపఁబడినయాముక్తమాల్యదమాత్రము ఆమృదుశైలి నొప్ప దాయెను. కవికర్ణరసాయనములోఁ గల్పనా చమత్కృతులును శాస్త్రసాంప్రదాయములును, పాండితీవిశేషంబులుగూడ నాముక్తమాల్యద కెక్కుడు గా నున్నట్లే పండితుల యభిప్రాయము. అయిన నాముక్తమాల్యద అనేకప్రబంధములకంటె మిన్నయై యున్న దనుటకు సందియము లేదు.

పై రెండుగ్రంథరీతులనే యనుసరించి కవిరాజమనోరంజన మను నొక గ్రంథము కనుపర్తి అబ్బయకవిచే మఱికొన్ని దినంబు లైన పిమ్మట రచియింపఁబడినది. ఆ గ్రంథము మాత్రము కవితాసౌకుమార్యాదులయందుఁ గవికర్ణ రసాయనమును ఆముక్తమాల్యదను మించియుండినను శాస్త్రపాండిత్యాదులలో నారెంటివలె ప్రౌఢముగా నుండదు.

ఆముక్తమాల్యద కృష్ణరాయకృత మయినందుల కింకొక యాధారము.

ఈ నడుమ నొక క్షత్త్రియమిత్త్రుం గలిసికొని ఆముక్తమాల్యద యొక్క కవినిగూర్చి మాటలాడుచుండగాఁ నతఁ డాముక్తమాల్యద కవి క్షత్త్రియుఁ డని చెప్పుటకును, అట్టి క్షత్త్రియుఁడు సామాన్యుఁడు గాక విశేషరాజభోగముల ననుభవించు మహారా జై యుండు నని తెలుపుటకుఁ దగిన దని యా ముక్తమాల్యదలోని యీక్రిందిపద్యంబుఁ జదివె. ఎట్లన్నను:-

శా. తారుణ్యాతిగఁజూతనూత్న ఫలయు క్తైలాభిఘాతస్వనో
     ద్దారా ధూశ్చితశుష్క దంబుహృతమాత్స్యచ్ఛేదపాకోద్గతో
     ద్గారంబున్ గనరార్చుభోగులకు సంధ్యావేళలన్ గేళికాం
     తారాభ్యంతరవాలుకాస్థితహిమాంత ర్నా రికేళాంబువుల్.