పుట:Kavijeevithamulu.pdf/515

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ కృష్ణదేవరాయలు.

509

వీరు స్వాధీనము కాని వారు.

ఉదయగిరి దుర్గాధిపతి యగు తిరుమల ప్రేతరాయ మహాపాత్రుఁడు పట్టుపడినాఁడు.

4. ఆసమయములో కృష్ణరాయ లెందఱు బ్రాహ్మణులకు వృత్తుల నిచ్చెను? 108 చతుర్వేదపారగు లగువారికి.

5. రాజపురోహితు లెవ్వరు? రంగనాథ దీక్షితులు, శివాదీక్షితులు.

వీ రిర్వురును స్మార్తబ్రాహ్మణులుగాన వీరు సర్వక్రతు సర్వతోముఖ వాజపేయ యజ్ఞ దీక్షాపరులుగాఁ గాన్పించుచున్నారు. దీనింబట్టి కృష్ణరాయఁడు కేవల వైష్ణవగురువుల నవలంబించి స్మార్తుల నిరాకరించినట్లుగాఁ గానంబడదు.

నెం. II. శాసనము 1438 సం (ధాత) సింహాచలము.

శ్రీమన్మహారాజాధిరాజ, రాజపరమేశ్వర, మూరు రాయరగండ, అరిరాయవి భాడ, భాషిగె తప్పు వరాయరగండ, యవనరాజ్యస్థాపనాచార్య, శ్రీవీరప్రతాప కృష్ణదేవ మహారాయలు విజయనగర సింహాసనారూఢుఁ డై పూర్వదిగ్విజయ యాత్రకు విచ్చేసి, ఉదయగిరి, కొండవీడు, కొండపల్లి, రాజమహేంద్రవరము మొదలయిన దుర్గాలు సాధించిరి. సింహాద్రికి విచ్చేసి స్వస్తి శ్రీ విజయాభ్యుదయ శా. స. 1438 అగునేఁటి ధాతసంవత్సర. చైత్ర. బ. ద్వాదశి వారాన సింహాద్రినాథుని దర్శించి తమతల్లి నాగాదేవమ్మగారికిన్ని, తమతండ్రి నరసారాయణిం గారికిన్ని పుణ్యమునకుగాను దేవునకు సమర్పించిన కంఠమాల 1కి ముత్యాలు 61, వజ్రమాణిక్యాల కడియాలు జోడు 1కి శంఖచక్రాలపతకము 1. పైఁడిపళ్లెము 1కి తూకాలుగా 44282. కానికి మాడలు 2000. తమ రాణీలు తిరుమల దేవమ్మగారిచేతను పతకము 1కి వరహాలు 500. తమచిన్నాదేవమ్మగారిచేత సమర్పించిన పతకము 1కి గా 500. యింతవట్టు సమర్పించిన ధర్మశాసనము.

ఈ రెండవశాసనమువలనఁ దేలిన విశేషములు వివరింపఁబడవలసియున్నది. ఇందు తొల్లిటి శాసనములోని బిరుదులకు వ్యతిరేకమై