పుట:Kavijeevithamulu.pdf/409

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పిండిప్రోలు లక్ష్మణకవి.

403


తే. సూక్తిచాతుర్యు పింగళిసూరనార్యు, ప్రీతబుధముఖ్యు నలసాని పెద్దనాఖ్యు
    నాంధ్రభాషా విశారదు లైనయట్టి, సకలసత్కవివర్యుల సన్నుతింతు.

ఇతఁడు తనకు గురుండు కీర్తియనతయ్య యని చెప్పి యతని గోత్రాదికముం జెప్పక యీక్రిందివిధంబున వ్రాసెను.

క. సేవింతు న్మద్గురుని య, శోవిలసితవిమలచిత్తు సురుచిరవిద్యా
   ప్రావీణ్యు కీర్తికులజు మ, హావినుతచరిత్రు నయ్యనంతాఖ్యుఁ దగన్.

లక్ష్మణకవి వంశావళి.