పుట:Kavijeevithamulu.pdf/389

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రామరాజభూషణకవి.

383

తే. అతఁడు వీరప్రతాపరాజాధిరాజ, రాజపరమేశ్వరాష్టదిగ్రాజకులమ
    నోభయంకరబిరుదుసన్నుతజయాభి, రామగుణహారి తిరుమలరాయశౌరి. ఆ 1. ప. 13

అనుదీనిం బట్టి చూడ నీతిరుమలరాయనికి భూవరాహలాంఛనమును, జీర్ణకర్ణాటరాజ్య పునరుజ్జీవనబిరుదమును వీరప్రతాప రాజాధిరాజ రాజపరమేశ్వ రాష్టదిగ్రాజకులమనోభయంకరబిరుదులు గలవని తేలును.

ఈ తిరుమలరాయఁడు సింహాసనాసీనుం డై యుండె నని తత్సింహాసనవిభవము రామభూషణునిచే నీక్రిందివిధంబున వర్ణింపఁబడియె. ఎట్లన్నను :-

సీ. కటకేంద్రుఁ డంపినగంధసింధురము లా, త్మస్వామిమాఱు హస్తములు మొగువ
    హయనాథుఁ డంపినహరులు కైజామోర, లార్చుచుఁ బతికి జో హారు సేయ
    నావాడపతి పంపినయమూల్యకటకముల్, కర్తపేరుగఁ బదాగ్రములఁ బెనగ
    బాండ్యేశుఁ డంపినభర్మంబు లధిపతి, ప్రతిగా నిజాంక ముద్రలు వహింప

తే. శౌర్యకీర్తులలో వచ్చుసకలదిఙ్న, రేంద్రరాజ్యేందిరలమాడ్కి నిగురుబోండ్లు
    చటులమాణిక్యమయదండచారుచామ, రములు నీవంగఁ బేరోలగమున నుండి.
                                                              ఆశ్వా. 1. ప. 15.

ఈపద్యమువలన గజపతియు నశ్వపతియు నీయిర్వు రితనిం గొల్చి యుండి రనియు నావాడపతియును, బాండ్యదేశాధివుఁడును ఇతనికి పన్నుల నిచ్చువా రనియుఁ దేలినది. పైపద్యమున అశ్వపతి గజపతులం జెప్పి నరపతి నేల చెప్ప లేదనుశంక వొడమును. ఇతఁడు నరపతియే గావున నాపే రిట వదలివేయఁబడియెను. కృష్ణరాయ లీమూఁడువంశములలోఁ జేరనివాఁ డగుటచే నతనికి మూరురాయరగండఁ డనుపేర చెల్లఃగల్గెను.

రామభూషణుండు తిరుమలరాయఁడు సింహాసనాసీనుఁ డై యుండి తనకు వర్తమానంబు పంపె నని యీక్రిందిపద్యములోఁ జెప్పుచున్నాఁడు :-