పింగళిసూరన.
317
పైవంశావళిలోఁ బ్రసిద్ధులం గూర్చినకొన్నిశ్లోకములు వివరించెదను. అవి చూచిన తోడనే వారివారి కాలనిర్ణయములు తెలిసిపోవును.
పైఁజెప్పినవిరూపాక్షరాజు శైవమతమును వదలి వైష్ణవమతము నందియుండుటకుఁ గొన్ని కారణములు చెప్పఁబడినవి.
ఈకథాసందర్భములలో నున్నశ్లోకములు.
"విరూపాక్ష స్తతో ధీమా న్వీరశైవమతో౽పి సః,
శ్రీశైలవంశసంభూతా జ్ఞాత్వా తౌ రామలక్ష్మణౌ.
పుత్త్రమిత్త్ర కళాత్రాదిసహిత శ్చ సనాగరః,
శ్రీశైలవంశతిలకా న్నృసింహార్యా జ్జగద్గురోః.
పంచసంస్కారసంపన్నో బభూవ సుమహాయశాః." (పుట 428.)
అని యున్నది. పై విరూపాక్షరాజుకాలము నీవఱకే శాసనాదికసహాయమున (Mr. R. Sewell) దొరవలన నిర్ణయించఁ బడియున్నది. (Vide Vol. II of his Lists of Antiquities.) అందు విరూపాక్ష శాసనములు క్రీ. శ. 1470 - 77 = 1393 శా. స. లో నొకటియును, క్రీ. శ. 1473 - 77 = 1396 శా. స. లో నొకటియుం గాన్పించును. మనకు సరియైనకాలనిర్ణయము దొరకనిచో నీకాలమునుండి లెక్క చూచుకొనుటకుగా దీనినుంచికొందము.
"నృసింహార్యస్య పుత్త్రో౽భూ త్తాతార్య ఇతి విశ్రుతః,
శ్రీశైలపూర్ణనా మాభూ త్తాతార్య స్యాత్మజో మహాన్,
త స్యాభూ చ్ఛ్రినివాసార్యః తస్య శ్రీతారదేశికః,
త స్యాభవ ద్వేంకటార్యః తస్య సున్దరదేశికః,
పుత్త్ర శ్శ్రీ సున్దరార్యస్య శ్రీనివాసాభిధో గురుః,
శ్రీనివాసగురోః పుత్త్ర స్తాతార్యో లోకవిశ్రుతః,
స తాతదేశిక శ్శ్రీమా న్మహాత్మా శాస్త్రవిత్తమః,
గ్రన్థం విధాయ విఖ్యాతం యః పఞ్చ్మతభన్జనమ్,
విఖ్యాత స్పర్వలోకేషు మహాత్మా విబుధాగ్రణీః,
.............................................................
శ్రీరామదేవరాయాఖ్యః కృష్ణరాయాదనఁతరమ్,
శశాస రాజ్యం థర్మేణ గురు భక్తిపరాయణః,