శ్రీనాథుఁడు.
277
కాశీఖండ విరచనము.
ఈగ్రంథములోపలనే శ్రీనాథుఁడు తా నీగ్రంథమును
"ప్రాయ మింతకు మిగులఁ గైవ్రాలకుండఁ, గాశికాఖం మనుమహాగ్రంథ మేను దెలుఁగుజేసెద"
అని వ్రాసియుండె. ఈగ్రంథముతోఁ గావ్యములుగాఁ బరిగణకు నెక్కం దగినగ్రంథములు శ్రీనాథకృతములు సమాప్తములు. అనంతరముగూడ మఱికొన్నిగ్రంథములు చాటుపద్యముల నీకవి రచియించి యుండవచ్చునుగాని యవి వ్యాపకములో లేవు. సంస్కృతకాశీఖండము కావ్యములలో నైషధకావ్యమువలెనే పురాణములలోఁ గఠినశయ్యకుఁ బ్రసిద్ధము. కావుననే దీనికి "కాశీఖండ మయఃపిండమ్" అను పేరు కల్గినది. ఈగ్రంథము వేమ భూపాలుఁడు కోరకమునుపే శ్రీనాథుఁ డాంధ్రీకరించుచున్నట్లును, అట్టి వృత్తాంతము విని యారాజు శ్రీనాథుం బిలుపించి నీవు రచియించుచున్నగ్రంథము మాతమ్ముం డగువీరభద్రారెడ్డిపేరిటఁ గృతి నియ్యవలయు నని కోరినట్లును దీనిలోని యొకపద్యమువలన నొకవచనమువలననుఁ గాన్పించును. ఎట్లన్నను :-
ఉ. స్కందపురాణసంహితకు ఖండము లేఁబది యందులోన నా
నందవనానుభావకథధంబున శ్రోతకు వక్తకున్ శుభా
నందపరంపరావహము నైజగుణంబునఁ గాశిఖండ మా
కందువ యే నెఱింగి సమకట్టితిఁ గావ్యము గా నొనర్పఁగన్.
వ. ఇమ్మహాప్రారంభంబు కర్ణాకర్ణి కావశంబున నాకర్ణించి, కర్ణాంత విశ్రాంతవిశాల నేత్రుండును, బంటవంశకమల మిత్రుండును, నశ్రాంతవిశ్రాణనక్రీడాపరాయణుండును వీరనారాయణుండును, నిత్యసత్యుండును, భూభువనభారభరణదీక్షాదక్షదక్షిణభుజా, భుజంగుండును, రాయావేశ్యా భుజంగుండును, కీర్తిగంగాతరంగిణీప్రవాహ పవిత్రత స్వర్గమర్త్యపాతాళుండును, జగనగోపాలుండును, విమల ధర్మశీలుండును, నగునల్లయ వీరభద్రభూపాలుం డొక్కనాఁడు.
గీ. నిజభుజావిక్రమంబున నిఖిలదిశలు, గెలిచి తను రాజ్యపీఠ మెక్కించినట్టి
యన్న వేమేశ్వరునియంక మాశ్రయించి, నిండుకొలు వుండెఁ గన్నులపండు వగుచు.