పుట:Kavijeevithamulu.pdf/275

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీనాథుఁడు.

269

మ. అరుదారన్ వివిధాగ్రహారములతో నాందోళికాఛత్రచా
     మరకళ్యాణకళాచికాదిబహుసమ్మా నార్హ చిహ్నంబు లా
     దర మొప్పారఁగ వేమభూవరునిచేతం గాంచె సామ్రాజ్యసం
     భరణప్రౌఢుఁ డమాత్యసింగఁడు నయప్రాగల్భ్యగర్వోన్నతిన్.

ఈపైరెండు పద్యములవలనను సింగమంత్రికి శ్రీనాథునిచే శృంగారనైషధము కృతి నందువఱకే త్రిభువనరాయవేశ్యా భుజంగ, కదనగాండీవి, జగ నొబ్బగండబిరుదు లున్నట్లును, అనేకాగ్రహారములతో ఆందోళిక, ఛత్ర, చామర, కళ్యాణకళాచి (పొందాను) కాది సన్మానార్హ చిహ్నములు వేమభూమీశునివలన సంప్రాప్తములై నట్లును కనిపించుచున్నవి. ఇవియునుగాక షష్ఠ్యంతములలోను, అశ్వాసాదిమాంత్యపద్యములలోఁగూడ నుండినసింగమంత్రియొక్క మఱికొన్ని బిరుదులు మొదలగువాని నీక్రింద వివరించెదను :-

క. శ్రీమహితు పెద్దకొమరుఁడు, వేమక్షితిపాలరాజ్యవిభవకళార
    క్షామణికి సింగసచిన, గ్రామణికిం బాండ్య రాజగజకేసరికిన్.

క. కేళాదిరాయ యభినవ, లీలాసుక రాంకచంద్రలేఖాంకురచూ
    డాలంకారపదాంబురు, హాలింగనసుఖితనిర్మలాఁతఃకరణా.

ద్వితీయా శ్వాసాంతములో నీక్రిందిపద్యము లున్నవి.

"మ. నవరత్నోపలదివ్యలింగవరదానప్రీత దాక్షాయణీ
       ధవ, కర్పూరవసంతరాయ, యనవద్యద్వాదశీవాసరో
       త్పవరుక్మాంగద వేమభూపతిమహాసామ్రాజ్యరక్షామణీ
       యవనాధీశసభానిరంకుశవచోవ్యాపారపారంగతా."

మూఁడవయాశ్వాసాంతమున

"స్రగ్విణి. తల్లమాంబాసుతా ధైర్యహేమాచలా, పల్లవాదిత్య సౌభాగ్యభాగ్యోదయా
 పల్లవోష్ఠీ కుచప్రాంతభాగద్వయీ, గల్లపాళీలసత్కారముద్రాంకురా."

నాల్గవయాశ్వాసంతమున

"మాలిని. హరిచరణసరో జధ్యాననిష్ఠాగరిష్ఠా, ధరణిభరదిధీర్షాధఃకృతా హార్యవర్యా
 తరుణకమల నేత్రా తల్లమాంబాసుపుత్రా, విరహితమదళంకా, వీరనారాయణాంకా."