Jump to content

పుట:Kavijeevithamulu.pdf/257

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీనాథుఁడు.

251



కము లగు ఘట్టములు లేవు. అట్టి పర్వత్రయముం దెనిఁగించిననన్నయ భట్టుగాని, భారతపరాంశ మగుహరివంశముం దెనిగించినశంభుదాసుఁడు గాని కేవలము వేదాంతార్థప్రతిపాదకము లగుఘట్టములం దెనిఁగింపరైరి. అందుచేతఁ బైయిర్వురుకవుల కట్టిసామార్థ్య మున్న దని చెప్పెడు గ్రంథదృష్టాంతములు శ్రీనాథునకుం గానుపించక పోవచ్చును. ఇఁక తిక్కనసోమయాజి కవిత్వములో నట్టివేదాంతార్థప్రతిపాదకము లగు నుద్యోగ, శాం, త్యానుశాసనికపర్వము లుండుటంబట్టియు, నట్టివానిని వేదాంతరహస్యములు దెలియనివారికిఁ దెనిగింప నసాధ్యము లవుటయుం జూచి శ్రీనాథుం డట్లు వ్రాసి యుండె నని యూహింపనై యున్నది. ఇదియునుగాక వేద వేదాంతార్థములు కేవలము తెలిసినను దదుక్తకర్మాచరణము లేనివారల కట్టిపట్లు తెనిఁగింప సమర్థత యుండ దని శ్రీనాథుఁడు తానట్టివాఁడు గాకుండుటంబట్టి యూహించి యుండును. శ్రీనాథుఁడేగాక యతనితండ్రియును దాతయుఁగూడ వైదికసంపత్తి లేనివారే. తిక్కనసోమయాజివంశ మట్లు గాదు. సోమయాజితండ్రి యగు కొమ్మనామాత్యుఁడు సాంగవేదవేది యని యుండె. తిక్కనసోమయాజి వేదవేదాంగముల నేర్చినవాఁడేగాక వైదికమార్గనిష్ఠమగువర్తనమును నిర్వహించునట్టియజ్వగా నుండెను. కావునఁ బై విషయములలో శ్రీనాథుఁడు తనకంటెను నన్నయభట్టాది పూర్వకవులకంటెను భారతామ్నాయముం దెనిఁగించుటకుఁ దిక్కన యొక్కఁడే లౌక్యవైదికములు రెండింటను సమర్థుఁ డని యెంచి యారీతిగా వర్ణించెను. "నాబ్రహ్మా క్రమపాఠకః" అని సామాన్యపుక్రమపాఠకులనే బ్రహ్మయంతవాఁ డని చెప్పఁగా వేద వేదాంగములం జదివి తదర్థావబ్ఫ్ధము కల్గి తద్రహస్య వేది యై, తదుక్తశ్రౌతస్మార్తకర్మముల నాచరించుచు, నాంధ్రమునఁ గవిత్వమహాదీక్షావిధి నుండి యందు నిరుపమాన కవిత్వమహత్త్వముం జూపి భారతము నాంధ్రీకరించినతిక్కనయజ్వను సర్వవిధములఁ గవిబ్రహ్మ యని శ్రీనాథుఁడు చెప్పుట యెంతయు నొప్పి యున్నది. ఇట్లు శ్రీనాథుఁడే