పుట:Kavijeevithamulu.pdf/256

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

250

కవి జీవితములు

"మ. కనకక్ష్మాధరధీరు వారిధితటీకాలట్టణాధీశ్వరున్
       ఘనునిన్ పద్మపురాణసంగ్రహకళాకావ్యప్రబంధాధిపున్
       వినుమధ్యాంతరసార్వభౌముఁ గవితావిద్యాధరుం గొల్తు మా
       యనుగుందాతఁ బ్రదాత శ్రీకమలనాభామాత్యచూడామణిన్"

శ్రీనాథస్తోత్రాభిప్రాయము.

పైకవులవర్ణన చేయునపుడు శ్రీనాథుఁడు వారివారికవిత్వములోని విశేషములును వారిమహత్తులును విశేషముగ గుర్తెఱిఁగినవాఁ డవుటం జేసి యథార్థవర్ణనమునే చేసినట్లుగా నూహింపవలసి యుండును. అందు వేములవాడభీమకవిం గూర్చి చెప్పుచో నుద్దండలీలలఁ గవిత్వము చెప్పునట్లుగా వ్రాసెను. నన్నయభట్టును వర్ణించుచో ధీరమతి యనియును, ఉపాధ్యాయసార్వభౌముఁ డనియును, కవితాపట్టాభిషిక్తుఁడనియును, ఉభయవాక్ప్రౌఢి గలవాఁ డనుటంబట్టి యుభయభాషావాగనుశాసనుండనియును, శబ్దశాసనుం డనియును వివరించె. ఇఁక శంబుదాసాపర నాముం డగునెఱ్ఱాప్రగ్గడను వర్ణించునపుడు సత్ప్రబంధమహేశ్వరుఁ డనియును, సూక్తివైచిత్రి గలవాఁ డనియుం దెల్పెను. తనతాత యగు కమలనాభుంగూర్చి చెప్పునపుడు, సరససాహిత్యసామ్రాజ్యచక్రవర్తి యనియుఁ గవితావిద్యాగురుం డనియుం జెప్పెను.

తిక్కనసోమయాజింగూర్చి వ్రాయుచో శ్రీనాథుఁడు తనకుఁ గల విశేషాదరముం దెల్పునట్లుగ రసాభ్యుచితబంధములం జెప్పుననియును, సత్కవిశ్రేష్ఠుఁ డనియును నుడివెను.

ఇట్లుగా నీతిక్కనసోమయాజిని జతురాననతుల్యుం డని చెప్పుటకుఁ గారణము పంచమ వేదతుల్య మగుభారతము నాంధ్రీకరించుటయే యని చెప్పఁగా నద్దానిం దెనిఁగించిన నన్నయశంభుదాసుల నేమికారణమున నట్లుగా శ్రీనాథుఁడు వర్ణింపఁడయ్యె నని యొకశంక పొడముచున్నది. దానికిఁ గారణమును మన మూహింపఁగలము. ఎట్లన్నను :- భారతములోనిమొదటి మూఁడుపర్వములలో వేదవేదాంతార్థ ప్రతిపాద