పుట:Kavijeevithamulu.pdf/245

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెనాలి రామకృష్ణకవి.

239

రామకృష్ణునిచాటుధారాపద్యములు.

ఈరామకృష్ణుఁడు పదగుంభనకవిత్వంబునకు మిగులఁ బ్రసిద్ధుఁడు కావున నీతఁడు పాండురంగవిభునిపదగుంభన మని తొంటిపద్యంబున వాక్రుచ్చెను. దానికిఁ దార్కాణంబుగ నీక్రిందఁ గొన్ని పద్యంబుల వివరింతము.

గీ. అతివక చనాభిజఘనదేహాననము లు, మీనదరసాలతారాజపానిరాక
    రణ మనంత మనాది నేత్రగళభుజన, భోష్ఠకుచవచోదంత ముభయగతిని.

ఈచిన్ని పద్యంబున నొకస్త్రీయవయంబులవర్ణన మంతయు నిమిడ్చె.

మఱికొన్నిపద్యంబుల వివరింతము.

"సీఁ. భుజగలోకాధీశభోగితల్పశయాన, హరిరూపధరమహాపురుష యనుచు
      నతులాబ్జమకుటవర్ణితపాదరాజీవ, రామార్చనీయశ్రీరంగ యనుచు
      మారీచమదభంగమహితవాయ వ్యాస్త్ర, శరదనిద్రితనేత్రజలజ యనుచు
      సముదగ్రవర్షావసరయోగనిద్రాణ, కరిరాజవరద శ్రీకాంత యనుచుఁ

గీ. దలఁకు సులుకు నలంకు బెగ్గిలుచుఁ బలుకు, సఖులనయనస్వనశిరోజచరణకలన
    పవనకందర్పఘనహాంసజవనతురగ, భటనటప్రియసముదాయపటిమ దోఁప.

క. విధుకృతకదనము వదనము, మధుకరనికరముల గేరు మగువచికురముల్,
    విధుమధుకరలీలాజయ, మధురోక్తులు పిక్క లౌర మధురాధరకున్.

సీ. ద్విరదంబు నడతోడ సరి రాక ముఖణంగ, దశ నొంది నవ్వుతోఁ దనరఁ జూచె
    గగనంబు నడుముతోఁ బగఁ జెంది మధ్యమాం,తము నొంది వేణితో సమతఁ బూనె
    పారసం బంఘ్రితో సరి రాక సావర్ణ్య, గతి మాని మోనితోఁ గదియఁ జూచెఁ
    గనకారి కటితోడ నెన మాని నారివే, షముఁ బూని మేనితో సరిగఁ జూచెఁ

గీ. దిరిగి సతికంఠకుచబాహుసరసనాసి, కలకు భయ మంది మొఱ పెట్టి గతులు మాని
    యొరగి ధరఁ గూల వత్తులై యెకట రెంట, మూఁట నాల్గంటితో సరి మొనయవయ్యె.

గీ. అధరముఖవర్ణ శూన్యంబు లతివకుచము, లాననా కారరహిత మజ్జాక్షిమేను
    అజజఘనమండలము లంచయానకురులు, చరసుఖాదితకరములు చానతొడలు.

చ. సతికుచవాక్సమత్వ మరిజాతసుధ ల్గొనఁ బూని వాదు లై
    హతులయి వారిజాతవసుధాకృతు లూని యు దృజ్నితంబని
    ర్జితరుచి గాంచియుం దుది నరిత్వముఁ జెందినచంద్రసేవధి
    స్థితిని ముఖాంగము ల్గెలిచె సీ తగ దిన్నిట నొంటి నోడినన్.