పుట:Kavijeevithamulu.pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెనాలి రామకృష్ణకవి.

219



బుగా నాతనికిట్లనిరి. ఈవఱకు రాజు మనలనందఱను సమానంబుగ గారవించుచుండె నని తలంచుచుంటిమి. అది యంతయు నేఁటికిఁ దెల్లం బయ్యె. భట్టుముందట మన ముప్పునకును నూరగాయకుంగూడఁ గొఱ గా మని రాజునకుం దోఁచియున్నది. ఇట్లుండ మన మిచ్చో నుండులాభ మెద్ది? దేశాంతరగతుల మైన నీపంత కొంత మానును. అనుడు రామకృష్ణుఁడు వారలం జూచి కడచినదానికి వగచుట గతజలసేతుబంధనము. కర్తవ్యము నిర్ణ యించిన నాకుం బోలిన సహాయంబు సేసెద. అనుడు వార లాతనిం గాంచి "యోయీ! యుపాయంబు తోఁచకుండుటచేతనే కదా నీకడ కరుదెంచితిమి; యేదియేని యుపాయము చేసి మమ్ము నుద్ధరింపుము." నా విని రామకృష్ణుఁ డిట్లనియె. "నాకుంబోలినయుపాయంబు చెప్పెదవినుండు. చేతగానిపర్వులిడుట నాచేతఁ గాదు. ఎట్టియుపాయంబున నైన నాభట్టుమెడం బెట్టియున్నహారంబు తోరంబుగఁ బట్టి నామెడ నిడికొని వచ్చెద. ఇది మీకు సమ్మతంబె" అనుడు వార లగుంగాక యని తమయంగీ కారమును దెలిపిరి. అపుడె బయలువెడలి రామకృష్ణుఁడు భట్టుమూర్తిమనికిపట్టు చేరి యొకభటునిచేఁ దనరాక నాతనికిఁ జెప్పిపుచ్చె. రామకృష్ణుఁడు వచ్చియున్నాఁ డనుపల్కు విని కడు నుల్కి కారణం బేమని మూర్తి కడుఁ జింతించి యేమియుఁ గానక తుద కేదియో మునిఁగె నని యెంచి యొంటిప్రాణంబుతోఁ జనుదెంచె. అపుడు రామకృష్ణుఁ డెదురుగఁ జని యాతని గాఢాలింగనంబు సేసి యిట్లనియె. "ఓయీః నాయుల్లం బిపుడు గదా చల్లనయ్యె, ఇంత దనుక నే నిట నుండుపండితులమాటలకు లోనై ని న్నన్యునిగ నెంచి నీ ప్రజ్ఞాతిశయంబులకు సహింపలేనైతి. ఈ దినంబుతో నాసంశయంబు లన్నియుఁ బాసె. నామనంబు నిష్కళంకం బగుడు నేస్తంబున కాన వొడమె. కావున నాయీప్సితంబు సమకూర్చుకొన నీకడ కరుదెంచితిని. నీవును బరేంగితజ్ఞానివి గావున మద్వాంఛితార్థంబు నొసంగుదువు, అనురామలింగనిపల్కుల కేమియు ననఁజాలక వెఱఁగంది చూచుచున్న