తెనాలి రామకృష్ణకవి.
215
లక్షఘంటకవి యనునొకమహానుభావుండు దర్శనార్థంబై వచ్చియున్నాఁడు. సెలవే" యనుడు, రాజు సభ్యులం జూచి "యాహా! యిది బహుసుదినంబు. పండితులపైఁ బండితు లేతెంచుచున్నారు. వారి నిటకుఁ దోడ్కొని రాఁదగువారిం బంపుఁ డని తిమ్మర్సున జాజ్ఞ యొసంగె. అతండును గొందఱుబుధజనులం దోడ్కొని వేషధారికడ కేఁగి రాజాజ్ఞఁ దెలిపెను. అతండును రాజాను మతంబు దెలిసి లోనికిఁ జనుదెంచు చో శిష్యజనులకుఁ బాఠంబు లుపన్యసింపుచు జను లచ్చెరువంది చూడ సభామంటపంబు సమీపించె. అంత నాభూకాంతుం డెదురుగఁ జనుదెంచి నితాంతభక్తి నాతనిపదంబుల కెఱఁగి సభాభవనమునకుం దోడ్కొనివచ్చి నిజసింహాసనపురోభాగమున నున్న యత్యున్న తాసనమునఁ గూర్చుండ నియమించి బహుమానపూర్వకముగఁ బూజలు సేసి నిజసింహాసనమున నుండెను. ఇట్లు కూర్చుండి యున్న రాజశిఖామణింగాంచి వేషధారి యచ్చో నుండువిద్వజ్జనంబులఁ జూసి మృదుమధురభాషణముల వారివారి నామములును సామర్థ్యాతిశయములు నడుగం దొడంగెను. అనంతరము తమయెడమప్రక్కను గించిదున్న తాసనమునఁ గూర్చుండి యున్న నరసన్న దిక్కు మొగంబై వీ రెవ్వార లనియె. రా జాతఁడు సహస్రఘంటకవి యని తెల్పెను. తెల్పిన నతఁడు వీరు సహస్రఘంటకవులా? వీరినామం బేమి యనుడు ప్రెగడరాజు నర్సన యని వాక్రుచ్చె. అపు డతనితో ముచ్చటింప నుద్యుక్తుం డైన ట్లభినయించి స్వామీ! యీ కవిశిఖామణిముఖము చూచినతోడనే సంభాషింప మనస్సున నుత్సాహము కల్గు చున్నది. సెలవే? అనుడు రాజు లక్షఘంటకవిం జూచి "విద్వా నేవ విజానాతి విద్వజ్జనపరిశ్రమమ్." అనునట్లు మీమీసామర్థ్యబోధంబున కై సంభాషింపఁ దగు ననుడు రామకృష్ణుండు మందహాసకంద ళితముఖారవిందుండై నర్సనకవిం జూచి యిట్లనియె.
"అరసికజనసంభాషణముకంటె రసికజనవాక్కలహము మేలు" అని యున్నది. కావున నే నిపు డామేలిపని నొనర్ప గమకించుచున్నాఁ