పుట:Kavijeevithamulu.pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

204

కవి జీవితములు

రాజు కింకరులం బంపుట.

ఆచార్యుఁడును దన కగునవమానము తలవంపులు తేఁగా నితరులకు ముఖము సూపలేఖ తల వంచి తనయంగమచ్చము మాటుపడ నడువఁదొడఁగెను. ఇట్లుండ రా జాతని దూరమునుండి పొడగాంచి గురుం డని నిశ్చయించి నిజభటులఁ గొందఱం బిలిచి యాయిరువురం జూచి వారిలోఁ బైవానిని గ్రిందికి దిగఁ ద్రోసి మర్దించి మా సమ్ముఖమ్మునకుఁ దెం డని యాజ్ఞ యొసంగెను.

కింకరు లాచార్యుని దండించుట.

అపు డాకింకరులు భయంకరాకారంబున శంకాతంకములు లేక జమునికింకరులవడువున బయలువెడలిరి. ఇట రామకృష్ణుఁడు పైనుండి చూచి యావృత్తాంత మంతయు నిమిషమాత్రమున గ్రహించి జాగ రూకత కది సమయ మని యెంచి పుడమిపైఁ బడ వడి నుఱికి యాచార్యులపాదములు పట్టుకొని యిట్లనియె. "స్వామీ! నాయపరాధమును సైపుఁడు. స్వాములప్రభావం బీవఱకుఁ దెల్లము గాకుండుటం జేసి యిట్టి యెగ్గు గావించితిని. ఎఱిఁగియెఱిఁగి యనర్థావహ మగుతావున నెట్టియౌన్నత్యము గల్గినను నుండుట మాబోంట్లకుఁ దగనిపని. నా ప్రవర్తనము నాకే భయదాయియై యున్నది. ఇట్టిసమయమున దేవర పాదములు దక్క నా కభయదాయక మింకొకటి గలదే? కావున నిఁక నీపాదములు నాయౌదల నుంచి నన్ను రక్షింపుమని యాతనిఁ దన భుజంపై నెక్కించుకొని నడువఁదొడఁగెను. రాజగురుఁడును మెల్లఁగఁ గూర్చుండి రామలింగనిప్రతిపత్తికి నచ్చెరు వంది బుధజనాపరాధమునఁ గల్గుదోసము విని కిపుడు పొసంగందోఁప నోవు. మత్ప్రభావము వీని కిప్పటికిఁ దోఁచినట్లు గాన్పించుచున్నది" అనుచు స్వస్వరూపానుభవము సేయుచు నానందాబ్ధిమగ్నుఁడై మార్గాయాన మపనయించు కొనుచు బ్రహ్మరథమున నిజమనోరథములు సిద్ధించునట్లుండెను. అంతలో భూపతిభటు లేవునఁ జనుదెంచి కోపము దీపింప వీఁపునం బఱిచి