పుట:Kavijeevithamulu.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేములవాడ భీమకవి

9



ర్యాంతర భారంబున నుండుటంజేసి మఱియొకపరి రమ్మని మాఱుపంచె. భీమకవి తనంతటఁ దాను వచ్చి వర్తమానంబు పంపినపుడు రాజు స్వయముగ వచ్చి తనకడ సెలవు గైకొనక యిట్లు వర్తమానంబు పంపుట కుం గోపించి యీక్రిందిపద్యంబు వ్రాసి మఱలఁ బంపెను.

క. శాపానుగ్రహపటువును, ఱాపాడెడికవులనెత్తిఱంపం బనఁగా
   భూపాలసభలఁ బూజ్యుఁడ, నాపేరే భీముఁ డండ్రు నరవర సభలన్.

ఇట్టిపద్యంబు చూచియు రాజు జాగరూకుఁడై యాకవిదర్శనంబునకు రాక మరలఁ దొంటియట్ల యుత్తరం బిచ్చెను. దానిచేఁ గ్రోధారుణితలోచనుం డై భీమకవి యీక్రిందిపద్యము వ్రాసెను. అదెట్లన్నను :-

ఉ. వేములవాడభీమకవి వేగమ చూచి కళింగగంగు దా
    సామము మాని కోపమున సందడి దీఱినవెన్క రమ్మనెన్
    మో మిటు చూప దోష మని ముప్పదిరెండుదినంబులావలన్
    జామున కర్ధమం దతనిసంపద శత్రులపాలు గావుతన్.

అని యిట్లు శాపం బిచ్చి యాతఁడు తనత్రోవం బోయెను. దానికిని కళింగగంగు లక్ష్యము సేయక యూరకుండెను. ఇట్లుండ శాపకాలంబు సంప్రాప్తమయ్యెను. అపుడు తత్సమీపంబున నున్న పర రాష్ట్రమువారు తద్వృత్తాంత మంతయు విని యాతనిపై దండెత్తి వచ్చి యాతనికోట నాక్రమించుకొనిరి. అపుడు రాజకళింగగంగు చేయునది లేక దేశాంతరగతుఁ డయ్యెను. పరులు నిర్భయంబుగ నచ్చో నుండి దేశమును బాలింపందొడంగిరి. రాజకళింగగంగు నేకాకియై దేశ దేశంబులఁ దిరిగి ప్రచ్ఛన్నరూపంబునఁ బగటివేషగాండ్రతోఁ గలిసి యుండి స్వోదరపోషణంబు గావించుచుండెను. ఇట్లుండఁ బెక్కుదినంబులు గడచినవి. అంత నొకనాఁటిరాత్రికాలంబున నీ రాజకళింగగంగు వేషధారులతోఁ బగటియం దుండి రాత్రి మఱియొక యూరికిం బోయి పర రాష్ట్రమువారినృత్తాంత మరయుటకు వచ్చుచుండెను. భీమనయు నొకయందలంబునం గూర్చుండి జోడుదివిటీలు వేయించుకొని విశేష వైభవంబుతో నాతని కెదురుగ వచ్చుచుండెను. వాహకులు భుజములు