పుట:Kavijeevithamulu.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెనాలి రామకృష్ణకవి.

193



మలయమారుతకవియు, నొక్కఁడే యని గాని చూపుటకు గ్రంథదృష్టాంతములు లేవు. అట్టిప్రతీతియైనను వ్యాపకములో లేదు. ప్రబోధచంద్రోదయ, వరాహపురాణములలోఁ బై యిర్వురు కవులకవిత్వ మున్నను దానిలో నేది యేకవికవిత్వమో చెప్పఁజాలము. కాని మాయిర్వురిలో మల్లయకవి ప్రథమగణ్యుఁ డవుటం జేసియును, రెండవకవి యగుమలయమారుతుఁ డాతనిమేనల్లు డగుటంజేసియుఁ బ్రథమకవియే ప్రధానగ్రంథకర్త యనియును, మొదల నుండియు సగముగ్రంథ మాతనికవనమే యనియును, తక్కినసగముభాగమును మలయమారుతకవి కవనం బనియును నూహింపఁదగియుండును. ముక్కుతిమ్మకవికిం గల మృదుకవనం ప్రబోధచంద్రోదయములోని పూర్వఖండములోఁ జూడ దగును. రెండవఖండములోని కవననైపుణి లెస్సగఁ బరికించినచోఁ బైకవనములోఁ గించిత్తు తక్కువయైనశయ్యతో నొప్పును, వరాహపురాణములోని మృదుతరభాగములు మల్లనకవి వనియును, నంతకుఁ గొంచెము న్యూనముగ నుండునది మలయమారుతకవికవన మనియును నిర్ణ యింప వచ్చును.

ఆంధ్రపంచకావ్యకవులచారిత్రము.

12

తెనాలి రామకృష్ణ కవి


ఇతఁడు నియోగిబ్రాహ్మణుఁడు, శుక్లయజుశ్శాఖలోనివాఁడు. ఇతఁడు తనవంశముంగూర్చి పాండురంగక్షేత్రమహాత్మ్యములోఁ గొంత చెప్పియున్నాఁడు. అంతకు విశేష మగువృత్తాంతము లేమైనను "పాండురంగవిజయ మనుగ్రంథములో నుండవచ్చును. కాని యాగ్రంథ మా మూలాగ్రముగఁ బ్రస్తుతము దొరుకుట లేదు. నా మిత్త్రులు కొందఱాగ్రంథములోనికొన్ని యాశ్వాసములు చూచినట్లె చెప్పియున్నారు. కాని వారికే యది రామకృష్ణునికవిత్వమని చెప్పఁదగినట్లుగాఁ గనుపిం