పుట:Kavijeevithamulu.pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

192

కవి జీవితములు

చ. కరచరణాదు లందఱుకుఁ గల్గినయంతటనే సమర్థతన్
   మెరవడిఁ గాంచ నేర్తురొ మనీషివరుల్ ధరలోన నెవ్వ రి
   క్కరణి ఘటింపుచుం గృతయుగంబునఁ ద్రేతను ద్వాపరంబునన్
   దరయుగ సాళ్వతిమ్మసచివాగ్రణికిన్ సరిమంత్రి గల్గునే.

అని యుండుటంబట్టి కృష్ణరాయనిమంత్రి యగుతిమ్మన్న యింటిపేరుసాళువవా రనియును. కృష్ణరాయనివంశనామము "తుళువవంశమువారు" అనియును దేలినది.

కావున నీశ్వరనారసింహ రాజు కృష్ణరాయనికాలమునకుఁ బూర్వపువాఁ డని కాని అందుమూలముగఁ నతనికవీశ్వరు లగునందిమల్లయ్య, మలయమారుత కవులు కృష్ణరాయనికంటెఁ గాని యతనితండ్రి యగునరసింగరాయనికంటెఁ గాని పూర్వు లయినట్లుగాఁ గాని యిందు స్థిరపఱుపఁబడదు అట్లైనను గాకున్నను కాలనిర్ణ యసిద్ధాంతమున కా యంశము చాలదు. మల్లయకవి కాలనిర్ణ యమును నట్లే కావున నామార్గము వదిలి యిఁక మల్లయ, మలయమారుతకవుల కాలము పారిజాతాపహరణ ప్రబోధచంద్రోదయములను వ్రాసినవిధముననే నిర్ణ యించెదము. అందు మల్లయకవియును, ముక్కుతిమ్మనయు నొక్క తండ్రికుమారులుగను తల్లిమాత్రము భేదముగాను నున్నట్లు కాన్పించుటంజేసి వారు సమకాలీను లైనట్లుండినను నుందురు. యిద్దిఱుతల్లులలో నెవ్వరు చిన్నయో యాసంగతి కాని మల్లయ, తిమ్మనలలో నెవ్వరు పెద్దయో యాసంగతిగాని చెప్ప నాధారము లేదు. వీరిర్వురును సవతియన్నదమ్ము లగుటంజేసి సమకాలీను లని చెప్పుట కేమియు నభ్యంతర ముండదు. ఈయిర్వురకు నలుబదియేఁబదిసంవత్సరములు వ్యవధి యున్నదని చెప్పినను జెప్పవచ్చును. అటులైన సమకాలీనులే యని నిర్ణయించి యిప్పటి కీసంవాదము నిల్పెదను.

నందిమల్లయకవికి ముక్కు తిమ్మన మనుమఁ డని కాని, యిందులోఁ జెప్పంబడిన మలయమారుతకవియు, తిమ్మకవిమేనమామ యగు