పుట:Kavijeevithamulu.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

8

కవి జీవితములు



ము చెప్పి వాని సంహరించి తనరాజునకు జయం బిచ్చెను. ఆపద్య మెట్లన్నను :-

ఉ. చక్కఁదనంబుదీవి యగుసాహిణిమారుఁడు మారుకైవడిన్
    బొక్కి పడం గలండు చలము న్బలమున్గలయాచళుక్యపుం
    జొక్కనృపాలుఁ డుగ్రుఁ డయి చూడ్కుల మంటలు రాలఁ జూచినన్
    మిక్కిలి రాజ శేఖరునిమీఁదికి వచ్చిన రిత్త వోవునే.

ఈకవి యొకానొకసమయంబున నీచొక్కనృపునిసభ నలంకరించి యుండఁగా నాతఁడు "స్వామీ ! మీ రాడినది యాటయుఁ బాడినది పద్యమును నగు ననియు, నేమనిన నది యట్లే యగు ననియు జగత్ప్రసిద్ధి గలదు. దాని నీసభవారికి వినోదార్థ మగుపఱుప వేఁడెదను" అనుఁడు నీ కేది యభీష్ట మనుఁడు నాతఁడు తనమల్లెశాల నున్న స్తంభము వృక్షము సేయుటయే యనియె. దానికి భీమకవి నవ్వి యిట్లనియె.

శా. అనీతాభ్యపదానుశృంగళపదభ్యాలంబిత స్తంభమా!
    నేనే వేములవాడభీమకవి గా నీ చిత్రకూటంబులో
    భూనవ్యాపితపల్లవోద్భవమహాపుష్పోపగుచ్ఛంబులన్
    నా నాపక్వఫలప్రదాయ వగుమా నాకల్పవృక్షాకృతిన్.

అని యిట్లు చదివినతోడనే యాసభవా రందఱును గన నది పుష్పఫలసమన్వితం బగువృక్షం బయ్యెను. అట్టివృత్తాంతమునకు రాజును సభవారును మిగుల సంతసించి మఱల దానిని స్తంభముగ నొనర్పు మనిన దానికి సంతసించి భీమకవి యి ట్లనియె.

ఉ. శంభువరప్రసాదకవిజాలవరేణ్యుఁడ నైన నావచో
   గుంభన సేయ నెంతయనుకూలత నొంది తనూనభావమై
   కుంభినిఁ జొక్క నామనృపకుంజరుపందిటిమల్లెశాలకున్
   స్తంభమురీతి నీతనువు దాల్పును యెప్పటియట్ల యుండుమా.

ఈభీమకవి యొకానొకసమయంబున విజయనగర (కళింగదేశములోనిది) సంస్థానాధిపుఁ డగురాజకళింగగంగును జూచువేడుక నచ్చటికిం జని తనరాక యాతనికిం జెప్పి పుచ్చె. అపుడు రాజకళింగగంగు కా