పుట:Kavijeevithamulu.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

178

కవి జీవితములు



థ మయ్యెఁ గావున నాపె నిద్రాభరంబునకు నోఁపఁజాలక పరాకున వ్యత స్తముగ శయనించినది. అత్తఱిఁ జెలు లాపెపై నొక్కపటము గప్పి యథేచ్ఛం జనిరి. కృష్ణరాయం డతఃపురంబున కే తెంచి స్వతల్పమునఁ దొంటియట్ల శయనించె. ఇట్లుండ ననంతరము వ్యత్య స్తశయాన యైననిజమహిషి పాదమాపురరవం బాతనికిఁ గర్ణగోచరం బయ్యెను. తోడనే దిగ్గన లేచి మంచమునలుగెలంకులఁ బరికించి యచ్చోఁ బాదము లుంచి నిద్రించుభార్యం గాంచి కారణ మూహించుచుఁ గొంతవఱకుఁ దెలిసి కోపించి తనలోఁ దా నిట్లనియె - "అద్దిరేయింతు లెంత మొఱకులు ఆలస్యము చేసితి నని నాపై నలిగినది గాఁ బోలు. కోపించినఁ గోపించుఁ గాక నను నవమానింపఁ దలంపఁ దా నెంతటిది ? ఇట్టియనుచితకృత్యమున కుద్యోగించినచో నొకపరి దండించిన ముం దెన్నం డిట్టిచెట్టలఁ జేయదు" అని పండ్లు పటపటం గొఱికి క్రూరదండనోపాయం బన్వేషింపుచు "భార్యాదండః, పృథక్ఛయ్యా" అని యున్నది గావున నట్లే చేసెదంగాక యని యచ్చోటు వాసి యింకొక భవనంబునకుం జని యచట శయనించెను. అనంతర మిట నాసాధ్వీమ తల్లి యెల్లవృత్తాంతమును జెలిక త్తియలవలన విని మనమున మిగుల దిగు లొంది కర్జంబు గానక యూరకుండెను. అట్లు గొన్ని దినములు గడచినవి.

ఇట్టివృత్తాంతము నంతయు నాపెయరణపుకవి యగుముక్కుతిమ్మన (నంది తిమ్మన) చూచాయగ గ్రహించి వైళంబ పట్టమహిషికడ కరుదెంచి "తల్లీ! నీ మొగము తొంటితేజంబుననుండ లేదు. దుర్లభకార్యమును జింతించుచున్నట్లు గాన్పించు. నే నుండ మీ రిట్లు చింతింప నేల? వృత్తాంత మెట్టిది యైన సెలవిం డనును రాజమహిషి "యంతఃపురరహస్యములు వెలువరించినచోఁ బ్రాణహాని యగును. నాపుణ్య మెట్లున్నదో యట్లగును వృథావిచారం బేల?" యనుడు నాతఁ డట్లనియె. "తల్లీ! పుత్త్రుఁడు రహస్యము నీకంటెను గుప్తముగ నుంచి