పుట:Kavijeevithamulu.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నందితిమ్మన.

177

దీనింబట్టి చూడఁగా దిమ్మకవి కౌశికగోత్రుఁ డగునాఱ్వేలనియోగిబ్రాహ్మణుఁ డనియును, వీరిగృహనామము నందివా రనియును, నీతనితండ్రిపేరు సింగన యనియును, తల్లి పేరు తిమ్మాంబ యనియును, దేలుచున్నది - ఇతని మేనమామపేరు మలయమారుతకవి. ఈమలయమారుతకవీంద్రుఁడు సకలవిద్యావివేకచతురుం డని ప్రబోధచంద్రోదయకృతిముఖంబునంగూడ వ్రాయఁబడినది. ఇతనిగ్రంథము లెవ్వియో యింకను మనకు గోచరము గాకున్నవి.

తిమ్మకవి గ్రంథారంభములోఁ దాఁను మొదట రాజాజ్ఞానుసారముగ నీపారిజాతాపహరణగ్రంథము రచియింపకుండుటంబట్టి యట్టిసందర్భము చెప్పఁడయ్యె. అనంతరము రాజు దానిం గృతి నందినాఁడు గావునఁ దన కాతనివలనం గలిగినవిశేషాదికము వక్కాణించి యుండెను. అందుఁ జతురంతయాన మహాగ్రహారముం జెందెను. ఈతఁ డఘోరశివగురునిశిష్యుం డని వ్రాసియుండుటంబట్టి దక్షిణామూర్తి మంత్రోపాసనాపరుండని తెలియవలయును. ఇట్టిశైవోపాసనమునం గల్గినప్రతిభవలననే తా నీగ్రంథమును రచియించితి నని మఱియు విస్పష్ట మగుకొఱ కాశ్వాసాంతగద్యములో "శ్రీమ దుమామహేశ్వర లబ్ధసారసారస్వతాభినంది" అని వ్రాసియుండె. ఇతఁడె కాక యితనివంశ్యులలో మఱికొందఱుగూడ నీదక్షిణామూర్తి నుపాసించినట్లే కానుపించును. ఈదక్షిణామూర్తి నుపాసించువారికిఁ గవిత్వప్రౌఢిమయే కాక విజ్ఞానసంపత్తియుం గల్గు నని చెప్పుటకు శంకరాచార్యుదులే చాలియున్నారు.

పారిజాతా పహరణము.

కృష్ణరాయలపేరిటఁ గృతి యీఁబడినపారిజాతాపహరణగ్రంథ రచనమున కొకచిత్రమయినకథ గలదు. ఒకానొకదినమున రాయలు రాత్రి భోజనానంతరము పండితజనగోష్ఠిచే సభలో నిశీథముదనుక నుండి యాస్థానము చాలించి శయ్యాగృహంబునకుఁ జనియె. అచ్చో నాతనిపట్టమహిషి యంతకుమున్ను హంసతూలికాతల్పమునం గూర్చుండి చెలులతో ముచ్చటలాడుచు భర్త్రాగమనంబు వీక్షించుచుండి, నిశీ