పుట:Kavijeevithamulu.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

160

కవి జీవితములు



దీనిని నిర్ణ యింపఁగలమో నాకు బోధ కాకుండ నున్నది. దశావతార చరిత్రంగూర్చి వ్రాయుచో నీవిషయమై సంపూర్ణముగ సంవాదించెదను. ప్రస్తుతములో మాత్రము లోకము వాడుకంబట్టి దానిని గ్రంథకర్థ యగుపుష్పగిరి తిమ్మనయును, ధరణీదేవుల రామమంత్రియును, కంకంటి పాపరాజును సమ కాలీను లనియును వారందఱును గృష్ణరాయానంతర కాలములోఁ బెన్గొండ, చంద్రగిరి సంస్థానములలో నాధిపత్యము చేసిన వీరవేంకటపతిరాయనిమంత్రి యై యతనివలనఁ జామరయుగళమును, పల్యంకిక భద్రదంతి మొదలగు సన్మానముల నందిన మదగలతిమ్మమంత్రి మనుమఁ డగు రామమంత్రికాలము లోనివారుగా నిర్ణ యింపఁబడవచ్చును. ఈమదగల రామమంత్రిపేరిటనే దశావతారచరిత్రము కృతియియ్యఁబడినది కావున నీపైకవు లందఱును శాలివాహనశకము పదునేడవశతాబ్దారంభములోనివారుగా నూహింపఁబడవచ్చును.

పాపరాజుకవిత్వశయ్యాదులు.

ఇతనికవిత్వము ప్రబంధకవులకవిత్వమురీతిని మిగులఁ బ్రౌఢిమ గలదియు రసవంత మైనదియు నని చెప్పవలసి యున్నది. కాని వ్యాకరణములోమట్టుకుఁ గొన్నిస్ఖాలిత్యము లగపడును. ఇతఁడు ప్రబంధకవుల వలెఁ దదవసరశాస్త్రములన్నిటిని విశేషించి పరిశీలించినవాఁడును, విశేష పరిశ్రమ చేసినవాఁడును గాకపోవచ్చును. కవిత్వవ్యాసంగములోమట్టుకుఁ బరిశ్రమ కలవాఁ డౌటచేత ధారాశుద్ధియును, భావప్రకటనయందు సమర్థతయును, విశేషించి యున్నవి. దానిం దెల్పుట కొకటిరెండు పద్యముల నీక్రిందఁ జూపెదను.

ద్వ్యర్థి.

"శా. వైదర్భీవిలసద్విలాసమునఁ జెల్వం బూని సత్యోక్తి నెం
    తే దీపించి కళింద జోజ్జ్వరసాప్తిన్ మించి భద్రాత్మకం
    బై దీవ్యద్ఘనలక్షణాశ్రయసమాఖ్యం గాంచుమత్కావ్య మా
    హ్లాదం బిచ్చు గ్రహింపఁ గృష్ణునకు నర్హంబే కదా యెయ్యడన్."