Jump to content

పుట:Kavijeevithamulu.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేములవాడ భీమకవి

5



గలియక తనపని తాను జూచుకొనుచుండెను. ఇట్లుండ మఱికొన్ని దినంబులు గతించినవి. అంత నాయూర నొకగొప్పగృహస్థునియింట యొక బ్రాహ్మణసంతర్పణ తటస్థించినది. అపు డాయూర నుండు బ్రాహ్మణు లందఱును భోజనంబునకుఁ బిలువంబడిరి. భీమకవిమాత్రము రండాపుత్రుండని పిలువంబడఁడయ్యెను. దానికి భీమన తనమనమున వగచి కార్య మగుచున్న వారివాకిటఁ గూర్చుండెను. ఇతఁడును వాకిట నున్నాఁ డనువర్తమానము దెలిసి తలుపులు దగ్గఱగా వేసికొని లోపల వడ్డనకారంభించిరి. అపుడు భీమన తనమాహాత్మ్యమును వారలకుఁ జూప నిశ్చయించి, యప్పాలు కప్పలు కావలె ననియు, నన్నము సున్నము కావలె ననియుఁ బాడం దొడంగెను. ఇట్టిపాటకు ననుగుణముగా లోపలఁ గప్పలును సున్నమును నగుడు నచ్చో నుండువారందఱును వెఱిచి దీనికిఁ గారణ మే మన నందులోఁ గొందఱు భీమనపాట విని దీనికి భీమనయే కారణము. ఆయన మహానుభావుఁడు. అట్టివానిం దోడితెచ్చి మనము పూజించితిమేని నీయూపద మాను నని నిశ్చయించి యజమానునిం దోడ్కొని వచ్చి యామహామహుం బ్రార్థించి లోనికిం దెచ్చిరి. అపు డాతడు తిరుగాఁ గప్ప లప్పములు గావలె ననియు, సున్న మన్నము గావలె ననియుఁ బాడినతోడనే యవి యన్నియు నట్లే యయినవి. అపుడు భీమకవి మహత్త్వము సర్వజనులకును గోచరమయినది. నాఁడు మొద లీత డెపుడును నగౌరవం బందఁడయ్యెను.

ఇతఁడు చళుక్యవంశపురాజగు చొక్కనృపాలుసభ నున్నట్లు కొన్నికొన్ని పద్యంబులచేఁ గాన్పించుచున్నది. ఆచొక్కనృపాలుఁడు రాజరాజనరేంద్రునివంశజుఁడు. అతనికిని రాజనరేంద్రునకును గలుగుసంబంధము రాజనరేంద్రచరితంబునఁ జెప్పఁ బడును.

ఈకవి యన్ని సంస్థానంబులం జూచి యా రాజులచే విశేషగౌరవము నందినట్లు వాడుక గలదు. ఇతని కాలములోనే మైలమ భీమన యనునొకదండనాథుఁడు గలఁడు అతనింగూర్చి యితఁడు కొన్నిపద్యములు సెప్పెను. భీమనకవిత్వపటిమఁ జూపుటకు