పుట:Kavijeevithamulu.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరరామాయణసందర్భము. తిక్కన.

151

అని యిట్లుగాఁ గృతిపతి నాశీర్వదించి ప్రాచీనాధునికకవులను వర్ణించుటకు నిర్దేశించి యెవరినామములను వివరింపక యీక్రిందివిధంబున వ్రాసెను. ఎట్లన్నను :-

చ. హరిహరపద్మగర్భులను నాదికవీంద్రుల నూత్న సత్కవీ
   శ్వరులను, భక్తిఁ గొల్చి తగ వారికృపన్ గవితావిలాసవి
   స్తరమహనీయుఁ డైన నను సర్వగుణోత్తరమూర్తి మన్మభూ
   వరుఁడు దగంగ రాఁ బనిచి వారనిమన్నన నాదరింపుచున్.

ఈపద్యముంబట్టి చూడఁగాఁ దిక్కననాఁటికి నతనిచేతఁ గవులు గా నుతియింపఁదగుప్రాచీనకవులు లేక యైన నుండవలయును. లేదా ? యట్టియాచారమైన లేక యుండవలయును.

ఇట్లుగా గ్రంథారంభంబు చేసి తిక్కన రాజు తన్నుం బిలువ నంపి గ్రంథరచన జాజ్ఞ నొసంగినకథఁ జెప్పుచున్నాఁడు. ఎట్లన్నను :-

క. ఏ నిన్ను మామ యనియెడి, దీనికిఁ దగ నిమ్ముభారతీకన్యక నా
   కీ నర్హుఁడ వగు దనినను, భూ నాయకుపలుకు చిత్త మున కింపగుడున్

దీనింబట్టి చూడఁ దిక్కనసోమయాజికి రాజునకుఁ గృతి నొసఁగుకోర్కె యదివఱలో లేదనియును, రాజు పల్కినమాటలోనిచమ చమత్కారముచేత మనస్సున నానందంబు గల్గుటచే నిచ్చినట్లును స్ఫురియించుచున్నది. దానికి దృష్టాంతముగ నీక్రిందిపద్య మున్నది. దాని వలనఁ దనమనస్సునకు సమ్మతి లేక యుండఁగా దానిని సయు క్తికముగ బోధించినట్లు కానుపించును ఆపద్య మెద్ది యనఁగా :-

సీ. సకలలోకప్రదీపకుఁ డగు పద్మినీ, మిత్త్రవంశమున జన్మించె ననియుఁ
   జూచిన మగలైనఁ జొక్కెడునట్టిసౌం, దర్యసంపదసొంపు దాల్చె ననియు
   జనహృదయానందజననమై నెగడిన, చతురతకల్మి నప్రతిముఁ డనియు
   మెఱసి యొండొంటికి మిగులశౌర్యత్యాగ, విఖ్యాతకీర్తిచే వెల సె ననియు.

గీ. వివిధవిద్యాపరిశ్రమవేది యనియు, సరసబహుమానవిరచితశాలి యనియు
   మత్కృతీశ్వరుఁ డగుచున్న మనుమనృపతి, సుభగుఁ గావించుటకు సముత్సుకుఁడ వైతి.