పుట:Kavijeevithamulu.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

148

కవి జీవితములు



వలనం జెప్పఁబడినపురుషులనామము లప్పకవీయములో నుచితస్థలంబున వివరించెదను. ప్రస్తుతము రామభద్రకవికి వర్తించునది. "రామరాజవిభూషణరత్న ఖచితచారుమస్తకలాపాదిహారి" అనువాక్యముం గూర్చి మాత్రము వ్రాయవలసి యున్నది. దీనియర్థము పైవృత్తాంతము చదివినవారికెల్ల గోచరం బగుట స్పష్టమే. ఇక్కడ "రామరాజభూషణకవి" యని యున్నది. పైని మనము "భట్టుమూర్తి" యని చెప్పి యున్నాము. అది లోకములో సామాన్యముగ "భట్టుమూర్తి" అనునది రామరాజభూషణునకుఁ గల్గినపర్యాయనామ మని చెప్పుకొనుభ్రమ వలనం గల్గును. ఆవృత్తాంతము భట్టుమూర్తి రామరాజభూషణులచారిత్రమునం జూచిన స్పష్ట మగును.

పైపద్యములో నాంధ్రకవులకుఁ గలబిరుదులం బట్టి వారినామములు స్ఫురించును గాని రామభద్రకవి పేరుమాత్ర మట్లు స్ఫురింపదు. ఇది చారిత్రసంబంధ మైనబిరుదుగాని గ్రంథాంతగద్యములోనిది కాదు. ఆగద్యము నిటఁ జూపినచోఁ బ్రమాదమునుండి పాఠకులం దప్పించును గావున దాని నిట వివరించెదను, ఎట్లన్నను :-

"గద్యము. ఇది శ్ర్రీమదొంటిమెట్ట రఘువీరశతకనిర్మాణకర్మతజగ దేకఖ్యాతి ధుర్యాయ్యలరాజు తిప్పయమనీషి సర్వతాభితానపౌ, త్త్రాక్కయాచార్యపుత్త్ర, పరిశీలిత సమిద్ధ రామానుజమతసిద్ధాంతమర్మ ముమ్మిడివరదాచార్య కటాక్షవీక్షా పాత్ర, హృదయపద్మాధిష్టితశ్రీరామభద్రరామభద్రకవి ప్రణీతం బైన రామాభ్యుదయ మహాప్రబంధము"

అనునీగద్యమువలన నీరామభద్రకవియొక్క వంశవృత్తాంతము గొంత విస్పష్టమగును.

అం దాయ్యలరాజువా రనునింటిపేరునుబట్టి చూడఁగా నీతఁడు నియోగి యగుట స్పష్టమే. ఇతనితాతపేరు తిప్పయాపరనామము గల పర్వతరాజు తండ్రిపేరు "అక్కయాచార్యుఁడు" ఇతనినాఁడు వీరు వైష్ణవమతప్రవిష్టు లైనట్లు కానుపించును. ఇతఁడు ముమ్మిడివరదాచార్యులను నొక రామానుజమతసిద్ధాంత మర్మజ్ఞుని శిష్యుఁడు. వరదాచార్యులు పర