పుట:Kavijeevithamulu.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అయ్యలరాజు రామభద్రయ్య.

139



వాఁ డనియును, "రామలింగభాస్కరుఁ" డని యుండినచో భట్రాజులచే నుతియింపఁబడు "రాయనిభాస్కరునిమనుమఁ" డనియును గ్రహింపవలయును. ఇట్టియేర్పాటులు చేసికొనిననాఁడు వీరివృత్తాంతములు కల గలపులే వీరికాలనిర్ణయమును జేయనీయక యెట్టివారి కైనను దిగ్భ్రమనుఁ బుట్టించును. కావున మెలఁకువతో దీనినిగ్రహింపవలయును.

రామాభ్యుదయకావ్యము.

ఇదివఱలో రామాయణము నాంధ్రీకరించినకవులవృత్తాంతమును జెప్పియున్నాము. ఇపుడు మనము రామాయణనామముతో నొప్పు గ్రంథములు రచియించినకవులను జెప్పవలసియున్నది. కాని యట్టినామములు గలపుస్తకము లనంతములై యున్నవి. కొందఱు తమగ్రంథములను బ్రబంధములుగా రచియించిరి. మఱికొందఱు కేవలసంగ్రహములుగా రచియించిరి. ఇంకొకకొందఱు శతకములుగా రచియించిరి. అవి యన్నియు రామాయణనామముతో నొప్పక యున్నను రామకథ కలవిగా నున్నవి. కావున నే నట్టిగ్రంథములు వదలి పురాణములతో పాటుగ గణనకు వచ్చిన వాల్మీకి రామాయణమును బ్రబంధములతో పాటుగ గణనకు వచ్చినరామాభ్యుదయ మనుగ్రంథములఁగూర్చియే యిందుఁ బ్రశంసింప నై యున్నాను. అం దిదివఱకుఁ బురాణముగా నెన్న బడిన వాల్మీకి రామాయణము నాంధ్రీకరించిన కవుల గూర్చి వ్రాసియున్నాను గావున నే నిపుడు రామాభ్యుదయగ్రంథకర్త యగునయ్యలరాజు రామభద్రయ్య చారిత్రముంగూర్చి వ్రాసెదను :-

_________

7.

అయ్యలరాజు రామభద్రయ్య.

ఇతఁ డొంటిమిట్ట (ఏకశిలానగర) నివాసి. ఒంటిమిట్టరఘువీరశతకము చిన్న తనములో రచియించెను. ఇఁతడు నిరుపేద. బహుకుటుంబ వంతుఁడు. ఏడెనమండ్రుపిల్లలు గలవాఁడు. ఇట్టిహేతువుచేత నితనికిఁ