పుట:Kavijeevithamulu.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పిల్లలమఱ్ఱి పినవీరభద్రయ్య.

109



చిత్రభారతము" అనుమఱిరెండుగ్రంథములకుఁ గవు లగు "పిల్లలమఱ్ఱి పినవీరభద్రయ్య, చరికొండ తమ్మన్న" అనువారి చరిత్రములు వ్రాయవలసి యున్నది. కాని హరివంశమును దెనిఁగించిన నాచనసోమనాథుఁ డను మఱియొకకవిచరిత్రమునుగూడ వ్రాయవలసియుండును. అతనికిఁ బ్రత్యేకము చారిత్రము వ్యాపకములో లేకయుండుటంబట్టి యతనికులగోత్రములు మఱికొందఱిచే నీవఱకే వ్రాయఁబడుటంబట్టియు నట్టివారిని చరిత్రములు గలవారితో పాటుగ వివరింపఁజాలను. ఇతనివలెనే చిత్రభారతమును రచియించిన చరికొండతిమ్మనకవియు నున్నాఁడు. కావున నతని చారిత్రమును వ్రాయఁబడలేదు. పైయిర్వురిపేరులును స్మరియించి చారిత్రవిశేషములు గలజైమినీభారతగ్రంథకర్త యగుపిల్లలమఱ్ఱి పినవీరభద్రయ్యంగూర్చి మాత్ర మిపుడు వ్రాసెదను.



కవిజీవితములు.

5.

పిల్లలమఱ్ఱి పినవీరభద్రయ్య.

ఇతఁడు నియోగిశాఖాబ్రాహ్మణుఁడు. తండ్రిపేరు గాదయమంత్రి. అన్న పేరు పెదవీరభద్రయ్య. ఇతఁడు సాళువగుండ నృపాలుని యాస్థానపండితుఁడు. ఈరాజు సభ్యులం జూచి జైమినిభారత మాంధ్రీకరించుటకుఁ దగువార లెవ్వ రని యడుగఁగా నాపండితులు పినవీరభద్రయ్యవంశవిశేషముల నీక్రిందివిధమున వర్ణించిరి. ఎట్లన్నను :-

సీ. అమృతాంశుమండలం బాలవాలము గాఁగ, ములిచె నొక్కటి జగన్మోహనముగఁ,
   జిగిరించె విలయసింధుగతకైతవడింభ, శయనీయవరపలాశములతోడఁ
   బితృ దేవతులకు సంచితసత్త్రశాలయై, చెట్టు గట్టెను గయాక్షేత్రసీమ
   నిలువ నీడయ్యె నిందీవరప్రియకళా, కోటీరునకు భోగికుండలునకు