పుట:Kavijeevithamulu.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎఱ్ఱాప్రెగ్గడ.

107

క. తిరుమల తిరువెంగళగురు, పరమకృపాలబ్ధవిభవభాగ్యాత్మునకున్
   హరిచరణక మలమధుకర, వరమతికిని జటులగంధవారణకృతికిన్.

అనుపద్యములంబట్టి యీమంత్రి గజపతిరాయనిమంత్రి యనియు, మహాపాత్రుఁ డనుబిరు దందినవాఁ డనియును, "జెంఖాన్" అనుప్రభునివలనఁ బ్రభుత్వము నంది వినుకొండకోట కధికారముచేసె ననియు, కటకము, ఢిల్లీ, కలుబరిగ మొదలగుస్థలములలో వ్యవహారము కలవాఁ డనియును, తిరుమల తిరువెంగళాచార్యులశిష్యుం డనియును దేలినది. ఇందులోఁ జారిత్రానుకూలము లగువిశేషములు పెక్కులున్నను అవిప్రత్యేకము విస్పష్టమై ప్రసిద్ధము లైనగాథలు కాకుండుటచేత నిదమిత్థమని నిర్ణయింప వీలులేదు. గజపతిరాయలవలన మహాపాత్రప్రసిద్ధబిరు దందినవాఁ డని చెప్పుటచేత ఆకాలము గజపతులు కొండవీడుదేశమును బాలించుచున్న కాల మని తోఁచుచున్నది. ఇది కృష్ణదేవరాయలు కొండవీటిదుర్గమును జయించుటకుఁ బూర్వము దీనింబట్టి యీమంత్రిశిఖామణి కృష్ణరాయలకాలమునకంటెఁ బూర్వుఁ డనియును, శ్రీనాథుఁడు, పోతరాజు మొదలయినవారికాలములోనివాఁడు కావచ్చుననియుం దోఁచు చున్నది. ప్రస్తుతములో నింత కంటె విస్తరింపవలసినది లేదు. కనుక నిపుడు మనము వ్రాయుచున్న యెఱ్ఱయకవియును ఆకాలమువాఁడే అని చెప్పెదము.

ఇందలిపైకవులశయ్యావిశేషంబులు.

నన్నయభట్టారకుని కవనంబును దిక్కన సోమయాజి కవనంబును బదశయ్యాదులం దొక్కతీరున నుండును. వీరిలోఁ దిక్కన మిక్కిలి సంగ్రహనైపుణి కలవాఁడు. ఈతఁ డేపద్యంబుఁ దాఁ జెప్పఁ దొరకొన్నను దానియందే తాఁ జెప్ప నిశ్చయించినయర్థమంతయుఁ బొందుపఱుచునుగాని తఱుచుగ నింకొకపద్యంబుతో దానికి సంబంధ ముండునట్లు చెప్పఁడు. చరణపూరణంబునకుఁ బ్రయోగింపఁబడుపొల్లుపదంబులు తిక్కన కవనంబునఁ దఱుచుగఁ గానరావు. నన్నయ తిక్కనల కవనంబుల వ్యాకరణభంగంబులుగాని ఛందోభంగంబులుగాని యుండవు. కా