పుట:Kavijeevithamulu.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎఱ్ఱాప్రెగ్గడ.

101



ట యనావశ్యక మని అచ్చులొత్తువారు అందలిముఖ్య భాగములుమాత్రమే ప్రచురించి రనియు నూహింపనై యున్నది.

ఆరణ్యపర్వ శేషము.

భారతములోని ఆరణ్యపర్వ శేషము నీతఁ డెప్పుడు తెనిఁగించె నో అది యితనిచేత విస్పష్టముగాఁ జెప్పఁబడలేదు. కాని యందులో నాల్గవయాశ్వాసములో "ధర్మరాజు నహుషప్రశ్నలకుఁ బ్రత్యుత్తరము లిచ్చుట" అనుభాగములోఁ గొంత నన్నయభట్టుచేతను అటు పిమ్మట నెఱ్ఱప్రెగ్గడచేతను రచియించఁబడినట్లు చెప్పఁబడి యున్నది. అందునన్న యభట్టుకవిత్వములోని తుదిపద్యము :-

ఉ. శారదరాత్రు లుజ్జ్వలలసత్తరతారకహారపంక్తులన్
    జారుతరంబు లయ్యె వికసన్నవకైరవగంధబంధురో
    దారసమీరసౌరభము దాల్చి సుధాంశువికీర్యమాణ
    కర్పూరపరాగపాండురుచిపూరము లంబరపూరితంబు లై.

అనునది. దీనినే పత్త్రికాముఖంబునఁ బ్రకటింప దానికిఁ దిక్కన సోమయాజి వర్ణమువేసె ననియు దానంజేసి యతఁడు భారతశేషము రచియించుటకుఁ బిలువంబడె ననియును మఱొయొకప్రతీతియుఁ గలదు.

ఈపద్యముతో నన్నయభట్టుకవిత్వము నిలిచిపోయినది. అనంతరము ఎఱ్ఱప్రెగ్గడకవిత్వము కానుపించును. కాని యిదియావెంటనే అనఁగా నన్నయభట్టు వదలివేసినవెంటనే రచియింపఁబడక మఱికొంతకాల మైనపిమ్మట వ్రాయఁబడినట్లు కానఁబడును. తిక్కనసోమయాజి తనకవిత్వము ఆరణ్యపర్వ శేషమునుండి యారంభింపక విరాటపర్వము నుండి యారంభించెను. అందులో :-

   "అం, దాది దొడఁగి మూఁడుకృతు లాంధ్రకవిత్వవిశారదుండు
    విద్యాదయితుం డొనర్చె మహితాత్ముఁడు నన్నయభట్టు దక్షతన్.

అని చెప్పియుండెను. దీనింబట్టి చూడఁగాఁ దిక్కనసోమయాజి నన్నయభట్టు ఆవఱకు రచియించియున్న గ్రంథమును జూడకయే వ్రాసియున్నట్లును గాన్పించును. కాని యెఱ్ఱప్రెగ్గడ భారతముతోఁ జేరియున్న హరి