పుట:Kavijeevithamulu.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు.

కవిజీవితములు.

4.

ఎఱ్ఱాప్రెగ్గడ.

(శంభుదాసుడు)

ఇతఁడు భారతములోని యారణ్యపర్వ శేషమును భారతముతోఁ జేరినహరివంశ మనుగ్రంథమును దెనిఁగించెను. లక్ష్మీనృసింహకథ ద్విపదగాఁ జేసెను. ఇతనింగూర్చినచారిత్రవిశేషములు తెలియకున్నను నీతనిగ్రంథములం జూచిన నీతనివంశావళి మొదలగునవి కొన్ని తెలియఁ గలవు. వానిని మఱియొకచో వివరించెదను.

గ్రంథరచనాకారణము.

"అని యిట్లు పూజ్యపూజాతత్పరుండ నైననాకు నభీష్టార్థదాతయై యవదాత చరితంబున నఖిలజనరంజనం బొనర్చుటంజేసి రాజశబ్దంబునకు భాజనం బగుచుఁ దేజోవిలా సైక నిత్యుండు, పల్లవాదిత్యుండు మొదలగు బిరుదంబుల నొప్పు వేమజనేశ్వరుండు."

అని గ్రంథారంభములో నెఱ్ఱాప్రెగ్గడ యొకవచనమును వ్రాసి ఆప్రభుండు అద్దఁ కిపురంబున భద్రసింహాసనమున నుండి తన్నుం బిలువం బనిచి యీక్రిందివిధ బునఁ బల్కినట్లు చెప్పియుండెను. ఎట్లన్నను :-

క. అంబుజభవనిభుఁడును పో, తాంబావిభుఁడు నగుసూరనార్యునిసుతు న
   న్నుం బూజితధూర్జటిచర, ణాంబుజు శ్రీవత్సగోత్రు సంచితచరితున్.

    వ. సవినయంబుగా నర్చించి యిట్లనియె.

గీ. సకలభాషాకవిత్వవిశారదుఁడవు, సాధుసమ్మతుఁడవు నిత్యసౌమ్యమతివి
   భవ్యుఁడవు గాన నీమీఁదఁ బరఁగఁ బక్ష, మేను గల్గి యుండుదు నెప్పు డెఱ్ఱనార్య.

శా. నాతమ్ముండు థునుఁడు మల్లరథినినాథుండు ని న్నా తత
   శ్రీతోడన్ సముపేతుఁ జేసి యెలమిన్ జేపట్టి మా కిచ్చుటన్
   జేతో మోద మెలర్ప రామకథ మున్ జెప్పించి యత్యుత్తమ
   ఖ్యాతిం గాంచితి నింకనుం దనియ నేఁ గావ్యామృతాస్వాదనన్.