పుట:Kavijeevithamulu.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

98

కవి జీవితములు



చాలియుండును. అయినను ఆంధ్రులలోనిబుద్ధిశాలు లాలోచించి యింకనుఁ బరిశీలించుటకుఁగాను లోకములోఁ గలయింకొకప్రతీతిని వివరించుచున్నాఁడను. దానిని మనస్సున నుంచుకొని శోధకులు గ్రంథములు లభించినపుడు పరిశీలింతురుగాక. అది యెద్ది యనఁగా :-

రామాయణము నాంధ్రీకరించిన వాస్కరుఁడును, నన్నయ భట్టారకుఁడును, వేములవాడ భీమకవియును, దిక్కనసోమయాజియును సమకాలీను లనియును, భాస్కరకవి రామాయణము తెనిఁగించుచు రావణసంహారానంతరము శ్రీరాముని వివిధదేవతలు చేయుస్తోత్రములు వివిధభూదేత లగుకవీశ్వరులచే రచియింపఁ బడి తనగ్రంథములో నుండవలయు నని కోరఁగాఁ బైకవీశ్వరు లందఱును తమపేరు లుంచి యొక్కొక పద్యము రచియించి యిచ్చి రనియును, ఆ పద్యములను వారిపేరిటనే ప్రకటించి రనియును వాడుక గలదు. కాని ముద్రితగ్రంథములలోఁ గాం డాంతగద్యములుకూడ మార్చి ముద్రింపఁబడినట్లుగా రామాయణకవుల చారిత్రములోఁ జూపించి యుంటిమి. కాఁబట్టి ప్రాచీనము లగుతాళపత్త్ర గ్రంథములు దొరకినపు డెల్ల నీవిషయమై పరిశీలన చేయుటకు బుద్ధిమంతులను బ్రార్థించి యిప్పటి కీఈవృత్తాంతమును వ్రాయ విరమించెదను.