పుట:Kavijeevithamulu.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తిక్కనసోమయాజి.

97



కావలసివచ్చును. ప్రస్తుతములోఁగూడ శాలివాహనశక మింకను 1820 లోపే కావునఁ బై గుణితము సంపూర్తిగా నసందర్భ మని చెప్పక తప్పదు. సోమయాజిమరణముం దెల్పుపద్యములో మనము చేసిన సిద్ధాంతమే సరియగునది యని ఖరసంవత్సరము శా. సం. 1333 అగుటచే స్థిరపఱుచును. అట్లైనచో సోమయాజినిర్యాణము శా. సం. 1120 అగును.

ఇట్లు సోమయాజిమృతికాలము సిద్ధాంతము కాఁగా సోమయాజి జననకాలము దానింబట్టి నిశ్చయించుట అతిసులభమై యుండును. ఇదివఱలో భారతము శా. సం. 1057 నకుఁ బూర్వమే తెనిఁగింపఁబడె నని చెప్పియున్నాము. అప్పటికిఁ దిక్కనసోమయాజి నలుబదియేఁబదిసంవత్సరములవాఁ డని యూహింప వచ్చును. అటులైనచో నాతనిజననము శా. సం. 1020 కి లోపుననే అయి యుండును. అది మొదలు సోమయాజికి నూఱువత్సరములు చెప్పవలసియుండును. ఇది సామాన్యముగ మనదేశములోఁ బ్రస్తుతకాలాయుర్దాయములనుబట్టి చూడ నాశ్చర్యముగాఁ గాన్పించును గాని సోమయాజిసమకాలీను లగురామానుజా చార్యుఁడు మొదలగు 120 సంవత్సరములు జీవించినవారితో సరిచేసి చూడఁగా దక్కువయే కాని అధిక మేమియును లేదు. పూర్ణాయుర్దాయవంతులు వేయుసంవత్సరములక్రిందట ప్రస్తుతమునకంటెఁ బెక్కండ్రున్నట్లుగా ననేకగ్రంథదృష్టాంతములు కలవు. కావునఁ దిక్కనసోమయాజి నూఱుసంవత్సరములు జీవించె నని చెప్పుట యుక్తిసహ మని వక్కాణించెదను.

సోమయాజియు నన్నయభట్టును సమకాలీను లనుట.

పై సంవాదములోఁ దేలినసిద్ధాంతములంబట్టి తిక్కనసోమయాజి పదునొకొండవశతాబ్దములో నున్న వాఁ డనుటకు సందియము లేదు గదా? ఇదివఱలో నన్నయభట్టారకుఁడు పదియవశతాబ్దాంతమునను పదునొకండవశతాబ్దములో నుండినట్లు చూపించి యున్నాము. ఈ యిర్విరును సమకాలీను లనుమాట దృఢపఱుచుటకుఁ బైసంవాదమే