పుట:Kavijanaashrayamu-Chandashastramu.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

12

లైన కోమట్లుండుట చేతను భీమకవి యాదేశమువాఁడే యనినిర్ణయించుట కాక్షేప ముండఁగూడ దని నాయభిప్రాయము.

"ఘనుఁడ న్వేములవాడవంశ జుఁడ దాక్షారామభీమేశనం
 దనుఁడన్..........................."

అనుచాటుపద్య మీసిద్ధాంతమును బాధించునట్లు స్థూల దృష్టికిఁ దోఁపవచ్చును, గాని, బాధింపదు. ఏల యన, వేములవాడక్షేత్రమాహాత్మ్యములో నాస్థలమునకు దక్షవాటి యను సంజ్ఞకూడఁ గలదు. దీనికిఁ బ్రమాణము.

శ్లో. ఏవం శ్రుత్వావచోదేవా వీరభద్రము ఖేరితం,
    ప్రణేముశ్చ శివౌతత్ర పూజయామాసురుత్తమౌ.
    ఉపయాతౌతతో భూయో మివపశ్ళిఖరంశివౌ,
    జనయామాసతుస్తత్ర శివలింగం సనాతనమ్.
    దక్షవాట్యాం భీమలింగం యత్ర రాజేశ్వగ శ్శివః ,
    అస్య లింగస్య మాహాత్మ్యం దృష్ట్వా సర్వేహవిర్ముఖాః,
    పుపూజు స్సర్వకామైశ్చ వీరభద్రస్యసన్నిధౌ,
    సదేవతౌఘై రపి పూజ్యమానం విలోక్యభీమేశ్వర మప్రమేయం,
    అధోక్షజాద్యైరభినంద్యకామాన్ దదౌ మహాత్మా యివ సద్గుణేభ్యః.

ఇతి శ్రీభవిష్యోత్తరపురాణే రాజేశ్వరమాహాత్మ్యే శివ స్వరూపదర్శనన్నామ చత్వారింశోధ్యాయః,

(అని యున్నది.)