పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సీతారాముల శాపము

71


ణంగా పడుకునే బిచ్చగాళ్ళకు నిద్రాభంగమై ఒకమాటు ఇటు అటూ కదిలారు. ఇంతలో వాళ్ల కాళ్లుచేతులు బంధింపబడి నోటిలో గుడ్డలు కుక్కినందువల్ల ఏమి చెయ్యలేకపొయ్యారు. సీతారాముల విగ్రహాల దగ్గరికి గబగబపోతూవున్న పాదాలచప్పుడు, బంగారు గొలుసులు కదల్చినచప్పుడు, దానితరువాత వీథిలో ఏనుగుల పాదాలచప్పుడు వినబడినవి. ఇం తే-అంతా సద్దు అణిగింది.

ఆ మర్నాడు పొద్దున్న దివ్యవజ్రం పోయిన సంగతితెలియ గానే లబాయిలూ దిబాయిలూ ఎవరు ఎత్తుకుపోయివుంటారు ? అని అర్చకులు ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు. బిచ్చగాళ్ళను కట్టిన తాళ్ళను విప్పుతూవుండగా కొత్తగావచ్చిన వారు ఆ రాత్రి వెళ్ళిపోయారనే కేకలు వినబడ్డాయి.

శాపం యొక్క పీడ ప్రారంభం

టెవర్నియరు కోరిక సఫలమైంది. వజ్రం పోయిన సంగతి అర్చకులకు తెలిసేటప్పటికి అతడూ అతని అనుచరులూ తప్పించుకొని చాలా దూరంపోయారు.

ఈ వజ్రంతో టెవర్నియరు ఫ్రెంచి దేశానికి వెళ్లగానే ఫ్రెంచి రాజైన 14 వ “లూయీ” వజ్రం మీద కన్ను వేశాడు. టెవర్నియరుకు అమ్మడం యిష్టంలేదు. ఇతనికి ఒక లక్ష నవరసులూ ఒక ప్రభు బిరుదు ఇస్తానని రాజు అనడంవల్లనూ ఆ సమయంలోనే టెవర్నియరు కొడుకు ఋణబాధలవల్ల ఆస్తినంతా తాకట్టు పెట్టినట్లు తెలిసినందు వల్లనూ టెవర్నియరు ఒప్పుకున్నాడు. టెవర్నియరు మళ్ళీ తూర్పు దేశానికి వెడుతూ దారిలో తీవ్రమైన జ్వరంతో బాధపడి చనిపోయాడు. దారిలో అడవికుక్కలు పీక్కుతిన్నాయని కొందరన్నారు. ఏమైతేనేమి టెవర్నియరు దుర్మరణం పొందాడు. ఇది సీతారాముల 'శాప ఫలిత మే సని కొంద రన్నారు.

వ జ్రం లో పి శా చం

ప్రెంచిరాజు' ఈపజ్రాన్ని చెక్కించినందువల్ల అది 67 క్యారెట్లు